టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న దిల్లీ

దిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మరికాసేపట్లో తమ ఎనిమిదో మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన దిల్లీ కెప్టెన్‌ రిషభ్ పంత్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు...

Published : 02 May 2021 19:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మరికాసేపట్లో తమ ఎనిమిదో మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన దిల్లీ కెప్టెన్‌ రిషభ్ పంత్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కాగా, దిల్లీ ఇప్పటికే ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. పంజాబ్‌ మూడు విజయాలతో ఐదో స్థానంలో నిలిచింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు సాగాలని ఇరు జట్లూ పట్టుదలతో తలపడనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని