Delhi: దిల్లీ జట్టులో కరోనా కలకలం.. ఆటగాడికి పాజిటివ్‌..!

ప్రస్తుతం జరుగుతోన్న మెగా టీ20 లీగ్‌లో మళ్లీ కొవిడ్‌ భయం నెలకొంది. తాజాగా ఓ దిల్లీ ఆటగాడికి కరోనా పాజిటివ్‌గా తేలిందని సమాచారం. అయితే, అతడు ఎవరనేది ఇంకా తెలియరాలేదు...

Published : 18 Apr 2022 12:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం జరుగుతోన్న మెగా టీ20 లీగ్‌లో మళ్లీ కొవిడ్‌ భయం నెలకొంది. తాజాగా ఓ దిల్లీ ఆటగాడికి కరోనా పాజిటివ్‌గా తేలిందని సమాచారం. అయితే, అతడి వివరాలు తెలియరాలేదు. దీంతో ఆ జట్టులోని మిగతా ఆటగాళ్లందర్నీ ప్రస్తుతం క్వారంటైన్‌కి తరలించారు. ఈ నేపథ్యంలో ఆ జట్టు.. పంజాబ్‌తో ఆడాల్సిన తదుపరి మ్యాచ్‌పై సందేహాలు నెలకొన్నాయి.

కాగా, ఇంతకుముందే దిల్లీ జట్టులో ఒక ఫిజియోకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆటగాళ్లకు యాంటిజెన్‌ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్‌గా తేలిందని తెలుస్తోంది. దీంతో ఆ జట్టులో ప్రస్తుతం ఆందోళన నెలకొంది. అయితే, వీరికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించాల్సి ఉంది. మరోవైపు గతేడాది 14వ సీజన్‌లోనూ బయోబబుల్‌లో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పుడు టోర్నీని మధ్యలోనే నిలిపివేసి.. పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి సెప్టెంబర్‌-అక్టోబర్‌ నెలల్లో దుబాయ్‌లో మిగతా టోర్నీని పూర్తి చేశారు. ఒకవేళ ఇప్పుడు కేసులు పెరిగితే నిర్వాహకులు ఏం చేస్తారనేది చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని