బెంగళూరుతో పోరు: టాస్‌ అదృష్టం దిల్లీదే

టీ20 లీగులో మరో రసవత్తరమైన పోటీకి దిల్లీ, బెంగళూరు సిద్ధమయ్యాయి. అబుదాబి వేదికగా తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన దిల్లీ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ మొదట బౌలింగ్‌ ఎంచుకున్నాడు...

Published : 02 Nov 2020 19:07 IST

అబుదాబి: టీ20 లీగులో మరో రసవత్తరమైన పోటీకి దిల్లీ, బెంగళూరు సిద్ధమయ్యాయి. అబుదాబి వేదికగా తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన దిల్లీ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ మొదట బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఛేదనలో మంచు ప్రభావం ఉండటంతో ఫీల్డింగ్‌ ఎంచుకున్నట్టు చెప్పాడు. రహానె, అక్షర్‌ పటేల్‌ తిరిగి జట్టులోకి వచ్చారు. బెంగళూరులో గురుకీరత్‌ స్థానంలో శివమ్‌ దూబె, సైని బదులు షాబాజ్‌ అహ్మద్‌ ఆడుతున్నారు. ఈ రెండు జట్లు 14 పాయింట్లతో ఉండటంతో గెలిచిన జట్టు 16 పాయింట్లతో ప్లేఆఫ్‌ చేరిన రెండో జట్టుగా నిలుస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని