సాహా కోసమే ధోనీ రిటైర్మెంట్: ఇషాంత్
వికెట్కీపర్ వృద్ధిమాన్ సాహాకు అవకాశాలు దక్కడం కోసమే టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ టెస్టులకు వీడ్కోలు పలికాడని పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్లో....
ఇంటర్నెట్డెస్క్: వికెట్కీపర్ వృద్ధిమాన్ సాహాకు అవకాశాలు దక్కడం కోసమే టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ టెస్టులకు వీడ్కోలు పలికాడని పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో ధోనీతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. మహీ వ్యక్తిగత రికార్డులను పట్టించుకోడని, జట్టు గురించే ఆలోచిస్తాడని లంబూ తెలిపాడు. 2014 ఆస్ట్రేలియా పర్యటనలో మెల్బోర్న్ టెస్టు అనంతరం ధోనీ టెస్టులకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సిరీస్లోని ఆఖరి టెస్టుకు కోహ్లీ నాయకత్వ బాధ్యతలు అందుకున్నాడు.
‘‘మెల్బోర్న్ టెస్టులో మోకాలి నొప్పితో విపరీతంగా ఇబ్బందిపడ్డాను. దాదాపు ప్రతి సెషన్కు ఇంజెక్షన్లను తీసుకుని బౌలింగ్ చేశా. కానీ ఆ మ్యాచ్ తర్వాత ధోనీ రిటైర్ అవుతున్నాడని ఎవరికీ తెలియదు. ఎందుకంటే అందరం టెస్టు మ్యాచ్పైనే నిమగ్నమై ఉన్నాం. నాలుగో రోజు టీ సమయానికి ధోనీ వద్దకు వెళ్లి.. ఇక నేను ఇంజెక్షన్లను తీసుకోలేనని చెప్పా. దానికి మహీ.. సరే, ఫర్వాలేదు, నువ్వు బౌలింగ్ చేయకని అన్నాడు’’ అని ఇషాంత్ తెలిపాడు.
‘‘అయితే రిటైర్మెంట్ అనంతరం.. ‘లంబూ నా ఆఖరి టెస్టులో నన్ను ఒంటరిగా విడిచిపెట్టావ్ కదా’ అని ధోనీ అన్నాడు. అదే ఆఖరి మ్యాచ్ అని తెలిస్తే కచ్చితంగా బౌలింగ్ చేసేవాడినని దానికి బదులిచ్చా. అది భావోద్వేగ సంఘటన. నిజంగా ఆ టెస్టు ఆఖరి రోజు వరకు అతడు టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నాడని తెలియదు’’ అని ఇషాంత్ తెలిపాడు.
‘‘ధోనీ దాదాపు 100 టెస్టులకు దగ్గరగా ఆడాడు. అతడు వ్యక్తిగత రికార్డులను పట్టించుకోడు. జట్టు మంచి కోసమే ఆలోచిస్తాడు. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో మహీతో మాట్లాడిన ఓ సందర్భం నాకు గుర్తుంది. ‘100 టెస్టుల మైలురాయిని అందుకోవడం నాకు పెద్ద విషయమేమి కాదు. వచ్చే సిరీస్ భారత్లోనే ఉంది’ అని నాతో ధోనీ అన్నాడు. అతడు సాహా ఎదుగదల గురించి ఆలోచించి రిటైర్మెంట్ ఇచ్చాడని భావిస్తున్నా. ఆ తర్వాత స్వదేశంలో సుదీర్ఘ సిరీస్ ఉంది. అందుకే అతడు వీడ్కోలు పలికి ఉంటాడు’’ అని లంబూ పేర్కొన్నాడు. టీమిండియా తరఫున ధోనీ 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. 2020, ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై పలికాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె