సరికొత్తగా ధోని

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని సామాజిక మాధ్యమాలకు వీలైనంత దూరంగానే ఉంటాడు.

Published : 18 Jul 2020 08:32 IST

దిల్లీ: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని సామాజిక మాధ్యమాలకు వీలైనంత దూరంగానే ఉంటాడు. ఎప్పుడో ఒకసారి ఓ వీడియోలోనూ, వేరే వాళ్లు పోస్టు చేసే ఫోటోల్లోనో తళుక్కుమంటాడు. లాక్‌డౌన్‌ కారణంగా పూర్తిగా ఇంటికే అంకితమైన అతను తన కూతురుతో ఆడుకుంటున్న వీడియోలో నెరిసిన గడ్డంతో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ధోని తన అవతారాన్ని మార్చేశాడు. గడ్డం కొద్దిగా పెంచి దానికి నల్ల రంగు వేశాడు. బహుశా ఓ వీడియోకాల్‌లో అతను మాట్లాడుతూ ఉన్న ఓ వీడియో బయటకు వచ్చింది. దాన్ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ట్విట్టర్లో పోస్టు చేయడంతో ధోని కొత్త లుక్కు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని