Dhoni: ‘చెపాక్‌లో ధోని చెలరేగిపోతుంటే ఉంటదీ’.. నెట్టింట అభిమానుల జోరు

భారత టీ20 లీగ్‌ను వచ్చే ఏడాది స్వదేశంలోనే నిర్వహించనున్నట్లు బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్ని రాష్ట్రాల అసోసియేషన్‌లకు రాసిన లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. క్రికెట్‌(Cricket) అభిమానుల్లో...

Published : 23 Sep 2022 01:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత టీ20 లీగ్‌ను వచ్చే ఏడాది స్వదేశంలోనే నిర్వహించనున్నట్లు బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్ని రాష్ట్రాల అసోసియేషన్‌లకు రాసిన లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. క్రికెట్‌(Cricket) అభిమానుల్లో ఈ వార్త సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ముఖ్యంగా చెన్నై (Chennai) ఫ్రాంచైజీ, ఎంఎస్‌ ధోనీ (MS Dhoni) అభిమానులు సంబరపడిపోతున్నారు. కొవిడ్‌ ఆంక్షల కారణంగా  గత రెండు సీజన్లలో మ్యాచ్‌లను కొన్ని వేదికలకే పరిమితం చేశారు. కానీ, వచ్చే సీజన్‌ను ‘సొంత మైదానం- బయట మైదానం’ తరహాలోనే నిర్వహిస్తామని గంగూలీ పేర్కొన్నాడు. దీంతో చెన్నైలోని చెపాక్‌ మైదానంలోనే తమ అభిమాన క్రికెటర్‌ ‘తలా’ ధోనీ.. ఆటను చూసే అవకాశం దక్కుతుందని ఆయన ఫ్యాన్స్‌ పొంగిపోతున్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పలు పోస్ట్‌లు పెడుతున్నారు. ‘ధోనీ ప్లస్‌ చెన్నై.. విధ్వంసమే ఇక..’, ‘సార్‌, చెన్నైకి వస్తున్నారు..’, ‘చెపాక్‌లో ధోని చెలరేగిపోతుంటే ఉంటదీ..’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని