Neeraj Chopra: నీరజ్ చోప్రా గ్యారేజీలో ఉన్న ఖరీదైన బైక్ ఏంటంటే?
నీరజ్ చోప్రా..ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. ఎందుకంటే
ఇంటర్నెట్ డెస్క్: నీరజ్ చోప్రా.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. ఎందుకంటే అతడు సాధించింది మాములు విజయం కాదు. అథ్లెటిక్స్లో తొలి పతకం కోసం భారత్ వందేళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. విశ్వ క్రీడల్లో జావెలిన్ త్రోను 87.58 మీటర్లు విసిరి దేశానికి స్వర్ణం అందించాడు.
అయితే, మనకు ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్గా మాత్రమే తెలిసిన నీరజ్ చోప్రాలో ప్రపంచానికి తెలియని మరో విషయం దాగింది. అదేంటంటే.. నీరజ్ చోప్రాకు బైక్లంటే చాలా ఇష్టం. అతడు మంచి బైక్ రైడర్ కూడా. తీరిక దొరికినప్పుడల్లా బైక్పై చక్కర్లు కొడుతుంటాడు. ఈ విషయం అతని ఇన్స్టాగ్రామ్ ఖాతాలోని ఫొటోలను పరిశీలిస్తే తెలిసిపోతుంది.
పల్సర్ 220ఎఫ్ బైక్ని ఇష్టపడని బైకర్ ఉండడు. నీరజ్కి కూడా ఈ బైక్ అంటే ఇష్టం. అందుకే దీన్ని తన గ్యారేజీలోకి తెచ్చేసుకున్నాడు. చోప్రా దగ్గర ఉన్న బైక్లలో హార్లీ డేవిడ్సన్ 1200 రోడ్స్టర్ ఖరీదైనది. దీన్ని 2019 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన తర్వాత కొనుగోలు చేశాడు. అదే సంవత్సరం ఓ ట్రాక్టర్ని కూడా కొన్నాడు. ఇవి ప్రస్తుతం నీరాజ్ స్వస్థలమైన హరియాణాలోని ఖాండ్రాలోని నివాసంలో ఉన్నాయి. మరి ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన నీరాజ్..ఈ సారి ఏ బైక్ కొంటాడో చూడాలి.
మరో విశేషమేమిటంటే..నీరాజ్ గ్యారేజీలో త్వరలో మహీంద్రా ఎక్స్యూవీ700 చేరనుంది. ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించినందుకుగాను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ వాహనాన్ని బహుమతిగా ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!