Neeraj Chopra: నీరజ్‌ చోప్రా గ్యారేజీలో ఉన్న ఖరీదైన బైక్‌ ఏంటంటే?

నీరజ్‌ చోప్రా..ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. ఎందుకంటే

Updated : 08 Aug 2021 13:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: నీరజ్‌ చోప్రా.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. ఎందుకంటే అతడు సాధించింది మాములు విజయం కాదు. అథ్లెటిక్స్‌లో తొలి పతకం కోసం భారత్‌ వందేళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. విశ్వ క్రీడల్లో జావెలిన్‌ త్రోను 87.58 మీటర్లు విసిరి దేశానికి స్వర్ణం అందించాడు.

అయితే, మనకు ఒలింపిక్స్‌ గోల్డ్  మెడలిస్ట్‌గా మాత్రమే తెలిసిన  నీరజ్‌ చోప్రాలో ప్రపంచానికి తెలియని మరో విషయం దాగింది. అదేంటంటే..  నీరజ్‌ చోప్రాకు బైక్‌లంటే చాలా ఇష్టం. అతడు మంచి బైక్‌ రైడర్‌ కూడా. తీరిక దొరికినప్పుడల్లా బైక్‌పై చక్కర్లు కొడుతుంటాడు. ఈ విషయం అతని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలోని ఫొటోలను పరిశీలిస్తే తెలిసిపోతుంది.

పల్సర్ 220ఎఫ్ బైక్‌ని ఇష్టపడని బైకర్‌ ఉండడు. నీరజ్‌కి కూడా ఈ బైక్‌ అంటే ఇష్టం. అందుకే దీన్ని తన గ్యారేజీలోకి తెచ్చేసుకున్నాడు. చోప్రా దగ్గర ఉన్న  బైక్‌లలో హార్లీ డేవిడ్‌సన్ 1200 రోడ్‌స్టర్ ఖరీదైనది. దీన్ని 2019 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన తర్వాత  కొనుగోలు చేశాడు. అదే సంవత్సరం ఓ ట్రాక్టర్‌ని కూడా కొన్నాడు. ఇవి ప్రస్తుతం నీరాజ్‌ స్వస్థలమైన హరియాణాలోని ఖాండ్రాలోని నివాసంలో ఉన్నాయి. మరి ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన నీరాజ్‌..ఈ సారి ఏ బైక్‌ కొంటాడో చూడాలి.

మరో విశేషమేమిటంటే..నీరాజ్‌ గ్యారేజీలో త్వరలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 చేరనుంది. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించినందుకుగాను మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్ మహీంద్రా ఈ వాహనాన్ని బహుమతిగా ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని