టీమ్ఇండియా కష్టాలు నాకూ తెలుసు: పైన్
ఒంటరి ప్రదేశాల్లో కుటుంబ సభ్యులు లేకుండా బయో బుడగల్లో గడపడం టీమ్ఇండియాకు కష్టంగానే ఉంటుందని ఆసీస్ సారథి టిమ్పైన్ అంగీకరించాడు. యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరిగినప్పుడు స్టీవ్స్మిత్, కమిన్స్ సహా తన సహచరులు ఇలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారని పేర్కొన్నాడు....
బ్రిస్బేన్: ఒంటరి ప్రదేశాల్లో కుటుంబ సభ్యులు లేకుండా బయో బుడగల్లో గడపడం టీమ్ఇండియాకు కష్టంగానే ఉంటుందని ఆసీస్ సారథి టిమ్పైన్ అంగీకరించాడు. యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరిగినప్పుడు స్టీవ్స్మిత్, కమిన్స్ సహా తన సహచరులు ఇలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారని పేర్కొన్నాడు. బ్రిస్బేన్లో నిర్వాహకులు కల్పించిన ప్రాథమిక సదుపాయాలపై భారత ఆటగాళ్లు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశాడు. నాలుగో టెస్టుకు ముందు పైన్ మీడియాతో మాట్లాడాడు.
గబ్బా టెస్టు కోసం బ్రిస్బేన్ చేరుకున్న టీమ్ఇండియా, ఆసీస్ ఆటగాళ్లకు ఓ హోటళ్లో బస ఏర్పాటు చేశారు. క్వీన్స్లాండ్లో యూకే వైరస్ స్ట్రెయిన్ కేసులు వస్తుండటంతో రెండు జట్లకు మరోసారి కఠిన క్వారంటైన్ ఏర్పాటు చేశారు. అక్కడ కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో భారత ఆటగాళ్లు అసంతృప్తి చెందినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై బీసీసీఐ క్రికెట్ ఆస్ట్రేలియాకు లేఖ రాసింది. ఫిర్యాదులు చేసిన వార్తలు రావడంతో మిచెల్స్టార్క్ సతీమణి అలీసా హేలీ భారత ఆటగాళ్లను ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.
‘అలాంటి వ్యాఖ్యలు నేను వినలేదు. నిజం చెప్పాలంటే టీమ్ఇండియా ఆటగాళ్లు ఫిర్యాదు చేసినట్టు ఎక్కడా చదవలేదు. ప్రత్యేక దేశంలో కుటుంబ సభ్యులు లేకుండా ఆంక్షల మధ్య ఉండాలంటే ఎవరికైనా కష్టమే. భారత ఆటగాళ్లు పడుతున్న ఇబ్బందుల్ని నేను అర్థం చేసుకోగలను. స్టీవ్స్మిత్, కమిన్స్ సైతం అలాంటి బాధల్ని అనుభవించారు. కష్టమే.. కానీ నేరుగా భారత ఆటగాళ్లు ఫిర్యాదులు చేయడం నాకైతే తెలియదు’ అని పైన్ అన్నాడు. కాగా హోటళ్లోని సమస్యలు టెస్టు మ్యాచుపై తమ ఏకాగ్రతను దెబ్బతీయలేవని టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ అన్నారు. మిగతా విషయాలు బీసీసీఐ, సీఏ చూసుకుంటాయని వెల్లడించారు.
ఇవీ చదవండి
‘అశ్విన్ ఒక్కడే 800 వికెట్లు తీస్తాడు’
వాహ్ అజహరుద్దీన్.. నువ్వెంతో గ్రేట్: సెహ్వాగ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్