Olympics: ప్రాచీన.. ఆధునిక ఒలింపిక్స్కు ఉన్న తేడాలివే!
ఒలింపిక్స్.. ప్రపంచ క్రీడారంగంలో అత్యంత సూదీర్ఘ చరిత్రగల మెగాటోర్నీ. ఇక్కడ పతకం గెలిస్తే దేశపు ప్రతిష్ట మరింత పెరుగుతుందన్న భావన. అందుకే దాదాపు అన్ని దేశాలు ఈ ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొంటాయి. కానీ, ప్రాచీన ఒలింపిక్స్ అలా కాదు. అప్పుడు ఈ ఒలింపిక్స్ ఒక స్థానిక క్రీడలన్న సంగతి తెలుసా? ఇదే కాదు, ప్రస్తుత
ఇంటర్నెట్ డెస్క్: ఒలింపిక్స్.. ప్రపంచ క్రీడారంగంలో అత్యంత సుదీర్ఘ చరిత్రగల మెగా టోర్నీ. ఇక్కడ పతకం గెలిస్తే దేశపు ప్రతిష్ట మరింత పెరుగుతుంది. అందుకే దాదాపు అన్ని దేశాలూ ఈ ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొంటాయి. కానీ, ప్రాచీన ఒలింపిక్స్ అలా కాదు. అప్పుడు ఈ ఒలింపిక్స్ ఒక స్థానిక క్రీడలన్న సంగతి తెలుసా? ఇదే కాదు, ప్రస్తుత ఒలింపిక్స్కు.. ఒకప్పటి గ్రీక్ ఒలింపిక్స్కు చాలా తేడాలున్నాయ్ అవేంటో చూద్దాం..!
* ప్రాచీన ఒలింపిక్స్లో ఒకప్పటి గ్రీక్ రాజ్యంలోని దేశాలు మాత్రమే భాగస్వామ్యయ్యేవి. ఇప్పుడు 200కుపైగా దేశాలు పాల్గొంటున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్లో 205 దేశాల నుంచి 11వేలకుపైగా అథ్లెట్లు వివిధ విభాగాల్లో పోటీపడుతున్నారు.
* అప్పటి ఒలింపిక్స్లో గ్రీక్రాజ్యంలోని పౌరులు మాత్రమే నగ్నంగా క్రీడల్లో పాల్గొనేవారు. మహిళలు పోటీలో పాల్గొనేందుకు అనర్హులు. కాకపోతే వారికి వేరుగా కొన్ని క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించేవారు. ఒలింపిక్స్లో పాల్గొనేలా గ్రీక్ రాజ్యంలో ప్రతి పౌరుడి విద్యాభ్యాసంలో అథ్లెటిక్ శిక్షణ ఉండేది. ఆధునిక ఒలింపిక్స్లో అన్ని దేశాలు పాల్గొనవచ్చు. పురుషులు, మహిళల కోసం వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నారు. కొన్ని క్రీడలు మిక్స్డ్ డబుల్ పేరుతో పురుషులు, మహిళలు కలిసి ఆడుతున్నారు. క్రీడల్లో పాల్గొనేందుకు అథ్లెట్లు వ్యక్తిగతంగా లేదా ప్రభుత్వ స్పోర్ట్స్ అకాడమీలో చేరి శిక్షణ పొందుతుంటారు.
* గ్రీక్ ఒలింపిక్స్ను మతపరమైన క్రీడోత్సవంగా నిర్వహించేవారు. గ్రీక్ దేవుడు జూస్ కోసం ఆడేవారు. కానీ, 1896లో ప్రారంభమైన ఆధునిక ఒలింపిక్స్ను ఒక అంతర్జాతీయ టోర్నీగా మార్చారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్న అథ్లెట్ అయినా ఈ పోటీల్లో పాల్గొని సత్తా చాటే అవకాశం కల్పించారు. ఇందులో గెలిస్తే వ్యక్తిగతంగా పేరు రావడమే కాదు.. దేశం కూడా గర్విస్తుంది.
* ప్రాచీన ఒలింపిక్స్ ప్రారంభోత్సవాల్లో వంద ఎద్దుల్ని బలి ఇచ్చేవారట. జ్యోతిని వెలిగించి.. పోటీలు పూర్తయ్యేవరకూ ఆరిపోకుండా చూసేవారు. ఇప్పటి ఒలింపిక్స్లో బలిదానాలు ఏమీ ఉండవు. కానీ.. కనులపండుగా ప్రారంభోత్సవ వేడుక జరుగుతుంది. క్రీడాభిమానుల సమక్షంలో సంగీత కచేరీలు.. కళకారుల ప్రదర్శనలు.. ఆటపాటలు.. బాణాసంచా వెలుగులు ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సారి టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో మాత్రం కరోనా నిబంధనల దృష్ట్యా క్రీడాభిమానులకు అనుమతి ఇవ్వలేదు. కొద్ది మంది అతిథులు మాత్రమే వేడుకకు హాజరయ్యారు.
* గ్రీక్ ఒలింపిక్స్ ఎప్పుడూ ఒలింపియా వేదికగానే జరిగేవి. మరో వేదిక ఉండేది కాదు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఆధునిక ఒలింపిక్స్కు ఒక్కోసారి ఒక్కో దేశం ఆతిథ్యమిస్తుంటుంది. తొలి ఒలింపిక్స్ను గ్రీస్లోని ఏథేన్స్లో నిర్వహించారు. ఆ తర్వాత ఫ్రాన్స్, అమెరికా, యూకే ఇలా అనేక దేశాల్లో ఈ మెగాటోర్నీ జరుగుతూ వస్తోంది. తాజాగా జపాన్లోని టోక్యోలో క్రీడలను నిర్వహిస్తున్నారు.
* ప్రాచీన ఒలింపిక్స్ క్రీడల్లో కేవలం ఒక్క విజేత మాత్రమే ఉండేవారు. పోటీలో గెలుపొంది అగ్రస్థానానికి వచ్చిన అథ్లెట్ను విజేతగా ప్రకటించి.. అతడికి ఆలివ్ ఆకులతో చేసిన కిరీటాన్ని ధరింపజేసేవారు. ఆ కాలంలో ఆలివ్ ఆకులను చాలా విశిష్ఠమైనవిగా భావించేవారు. అందుకే వాటితో సత్కరించేవారు. అలాగే, భూమిని కూడా రాసిచ్చేవారట. ఆ తర్వాత విజేత విగ్రహాన్ని ఒలింపియా స్టేడియంలో ఏర్పాటు చేసేవారు.
* గ్రీక్ ఒలింపిక్స్ నిర్వాహకులు ఎప్పుడూ వింటర్ ఒలింపిక్స్ నిర్వహించలేదు. వారికి ఆ ఆలోచన కూడా రాలేదు. కానీ, ఆధునిక ఒలింపిక్స్లో వింటర్ ఒలింపిక్స్ను ప్రారంభించారు. మంచులో.. మంచుతో ఆడే ఈ క్రీడలను తొలిసారి ఫ్రాన్స్లో 1924లో ప్రారంభించారు. ఈ పోటీల్లో 17 దేశాల నుంచి 258 అథ్లెట్లు పాల్గొన్నారు. వింటర్తోపాటు పారా ఒలింపిక్స్, యూత్ ఒలింపిక్స్ క్రీడలను సైతం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్వహిస్తోంది. తొలి యూత్ ఒలింపిక్స్ 2010 ఆగస్టులో సింగపూర్ వేదికగా జరిగింది.
* ప్రాచీన ఒలింపిక్స్లో గుర్రపు బండ్ల పరుగు, రన్నింగ్, రెజ్లింగ్, డిస్కస్ త్రో, షాట్పుట్, ఆర్చరీ, లాంగ్ జంప్, వెయిట్ లిఫ్టింగ్, జెవలీన్, జిమ్నాస్టిక్స్ వంటి క్రీడలు ఉండేవి. ఆధునిక ఒలింపిక్స్లో గుర్రపు బండ్ల పరుగు మినహా మిగతా వీటితోపాటు బైసైక్లింగ్, మారథాన్స్, స్విమ్మింగ్, డైవింగ్, సెయిలింగ్, షూటింగ్, టెన్నీస్ ఇలా అనేక అనేక క్రీడలను ప్రవేశపెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు