Gill-Ishan: కేఎల్ రాహుల్ వస్తే ఆ ఇద్దరూ ఒకే జట్టులో ఉండడం కష్టమే: మంజ్రేకర్
తన వివాహం కారణంగా కేఎల్ రాహుల్ భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్కి దూరమైన విషయం తెలిసిందే. అతడు అందుబాటులోకి వస్తే శుభ్మన్గిల్, ఇషాన్ కిషన్ ఇద్దర్నీ జట్టులో కొనసాగించడం కష్టమని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: కేఎల్ రాహుల్ తిరిగి వస్తే ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ ఇద్దర్నీ జట్టులో కొనసాగించడం కష్టమని భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. రాహుల్ వస్తే ఇషాన్ జట్టు నుంచి తప్పుకోవలసి ఉంటుందన్నాడు. ఇషాన్ మిడిలార్డర్లో స్థిరపడలేదని, అందువల్ల రాహుల్ స్థానంలో ఇషాన్ను తొలగించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
ఇషాన్కిషన్, శుభ్మన్గిల్ ఇద్దరూ ఇటీవలే వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదారు. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో ఇషాన్ 126 బంతుల్లో అత్యంత వేగంగా 210 పరుగులు చేసి ద్విశతకం సాధించాడు. న్యూజిలాండ్తో తొలి వన్డేలో శుభ్మన్గిల్ 149 బంతుల్లో 208 పరుగులతో డబుల్ సెంచరీ బాదాడు. కేఎల్ రాహుల్ తన వివాహం కారణంగా న్యూజిలాండ్తో సిరీస్కి దూరమయ్యాడు. వరుసగా వన్డే, టీ20 సిరీస్లు జరగనున్న నేపథ్యంలో రాహుల్ తిరిగొచ్చాక జట్టులో ఇషాన్, శుభ్మన్ స్థానం ఏంటి అనేది ప్రశ్నగా మారింది. ఇషాన్కిషన్, కేఎల్ రాహుల్ ఇద్దరూ వికెట్కీపర్లే. అందువల్ల రాహల్ వస్తే ఇషాన్ తప్పుకోక తప్పదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
‘‘కేఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చాక ఇషాన్కిషన్, శుభ్మన్ గిల్.. ఇద్దర్నీ జట్టులో కొనసాగించడం కష్టం అవుతుంది. ఇషాన్ కూడా వికెట్ కీపర్. అతడు ఐదో స్థానంలో ఆడాల్సి ఉంటుంది. కానీ మిడిలార్డర్లో అతడు ఇంకా స్థిరపడలేదు. ప్రదర్శన పరంగా రాహుల్ అతడి కంటే ముందున్నాడు. అందువల్ల రాహుల్ తిరిగి వస్తే ఇషాన్ తప్పుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మ్యాచ్లు జరుగుతున్నందున అప్పుడప్పుడు అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి యువ ఆటగాళ్లు అవకాశం వచ్చినప్పుడే ప్రతిభ చూపించి కొన్ని మ్యచ్లకు దూరమవ్వడం ఉత్తమం. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్కు చాలామంది క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు ’’ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.