Mike Hussey: భారత్లో టీ20 ప్రపంచకప్ కష్టం!
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్లో టీ20 ప్రపంచకప్ ఆడటం కష్టమేనని చెన్నె సూపర్కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ అన్నాడు.........
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత పరిస్థితుల్లో భారత్లో టీ20 ప్రపంచకప్ ఆడటం కష్టమేనని చెన్నె సూపర్కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ అన్నాడు. ఐపీఎల్ కన్నా ఎక్కువ జట్లు మెగా టోర్నీలో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపాడు. అలాంటప్పుడు ఎక్కువ వేదికలు అవసరమవుతాయని పేర్కొన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం మైక్ హస్సీ భారత్కు వచ్చాడు. చెన్నై సూపర్కింగ్స్కు బ్యాటింగ్ కోచ్గా పనిచేశాడు. చెన్నై జట్టు ముంబయిలో అద్భుత విజయాలు సాధించింది. అయితే వేదిక మారిన తర్వాత లీగ్లో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. ఈ క్రమంలో బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, హస్సీకి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడ్డా, హస్సీ ఇక్కడే క్వారంటైన్లో ఉండి చికిత్స పొందాడు. ఈ మధ్యే ఆస్ట్రేలియా వెళ్లాడు.
‘భారత్లో టీ20 ప్రపంచకప్ ఆడటం అత్యంత కష్టమని నా అభిప్రాయం. ఐపీఎల్లో ఎనిమిది జట్లే ఉంటాయి. టీ20 ప్రపంచకప్ ఇందుకు భిన్నమేమీ కాదు. అంతకన్నా ఎక్కువ జట్లే వస్తాయి. కాబట్టి ఎక్కువ వేదికలు ఉంటాయి. ముందే చెప్పినట్టు ఒకవేళ వేర్వేరు నగరాల్లో మ్యాచ్లు ఆడితే.. ప్రమాదం ఎక్కువగా ఉంటుంది’ అని హస్సీ అన్నాడు.
‘ఏదేమైనా బీసీసీఐ భారీ ప్రత్యామ్నాయ ప్రణాళికలతో ముందుకు రావాలి. యూఏఈ లేదా ఇంకేదైనా దేశంలో టీ20 ప్రపంచకప్ నిర్వహించేందుకు చూడాలి. ఎందుకంటే ప్రపంచంలోని చాలా బోర్డులు భారత్కు వెళ్లి టోర్నీ ఆడేందుకు ఆందోళన పడుతున్నాయని అనిపిస్తోంది’ అని హస్సీ వివరించాడు. ఐపీఎల్ వాయిదా పడటంతో బీసీసీఐ ఆచితూచి అడుగులు వేస్తోంది. టీ20 ప్రపంచకప్ నిర్వహణ గురించి బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.