WTC Final: భారత టాప్ ఆల్రౌండర్లు.. వీరిద్దరిలో ఒకరికే అవకాశం: డీకే
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని (Border - Gavaskar Trophy) ఆసీస్పై 2-1 తేడాతో టీమ్ఇండియా సొంతం చేసుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC Final) ఫైనల్కు దూసుకెళ్లింది. ఆ మ్యాచ్లో ఆడే తుదిజట్టుపై ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC Final) ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా తలపడనున్న విషయం తెలిసిందే. జూన్ 7 నుంచి లండన్లోని ఓవల్ మైదానం వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా తుది జట్టుపై ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది. పేస్ పిచ్లకు స్వర్గధామంగా ఉండే విదేశీ పిచ్లపై కూర్పు చాలా కీలకం. ఇదే అంశంపై టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తిక్ స్పందించాడు. తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లకు చోటు కష్టమేనని పేర్కొన్నాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలో ఒకరే ఉంటారని.. ఇక అక్షర్ పటేల్ స్క్వాడ్లోనూ ఉండకపోవచ్చని డీకే అభిప్రాయపడ్డాడు.
‘‘నిజాయతీగా చెప్పాలంటే రవీంద్ర జడేజా, అశ్విన్ ఫిట్గా ఉంటే.. అక్షర్ పటేల్కు చోటు దక్కడం దాదాపు అసాధ్యం. శార్దూల్ ఠాకూర్ జట్టులో చేరే అవకాశం ఉంది. ఇప్పుడు అందరిలోనూ మెదిలే అనుమానం ఏంటంటే స్పిన్నర్లు ఇద్దరూ తుది జట్టులో ఉంటారా..? గత డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ భారత్ ఇదే పొరపాటు చేసింది. ఇద్దరు స్పిన్నర్లతో ఆడింది. కానీ, బౌలింగ్లో మాత్రం గొప్పగా రాణించలేకపోయింది. అందుకే, ఈసారి అశ్విన్, జడేజాలో ఒకరు తుది జట్టులో ఉండబోరు. అయితే, బ్యాటింగ్ విషయానికి వస్తే అశ్విన్ కంటే జడేజా అత్యుత్తమ స్థాయిలో ఉన్నాడు’’ అని డీకే తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా