Dinesh Karthik: బెంగళూరుకు ధోనీలా తయారవుతోన్న డీకే
మహేంద్రసింగ్ ధోనీ.. క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. మ్యాచ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అతడు క్రీజులో ఉంటే చాలు. ఎలాగైనా మ్యాచ్ను గెలిపిస్తాడనే విశ్వాసం...
అచ్చం మహీలా ఫినిషింగ్ టచ్లు..
(Photo: Dinesh Karthik Instagram)
మహేంద్రసింగ్ ధోనీ.. క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అతడు క్రీజులో ఉంటే చాలు. ఎలాగైనా మ్యాచ్ను గెలిపిస్తాడనే విశ్వాసం. సరిగ్గా ఇప్పుడు అదే నమ్మకాన్ని కలిగిస్తున్నాడు బెంగళూరు వికెట్ కీపర్, బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్. చాలా కాలంగా సరైన ప్రదర్శన లేక అటు అభిమానులు, ఇటు క్రికెట్ వర్గాలు ఆశలు వదులుకున్న వేళ బెంగళూరు తరఫున అదరగొడుతున్నాడు.
అప్పుడే ఫినిషర్ రుచి చూపించాడు..
(Photo: Dinesh Karthik Instagram)
దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ క్రికెట్లోకి ధోనీకన్నా ముందే వచ్చాడన్న సంగతి తెలిసిందే. అయినా అతడికి సరైన గుర్తింపు దక్కలేదు. 2004లోనే టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేసినా 2005లో మహీ వచ్చాక చోటు కోల్పోయాడు. దీంతో అప్పుడప్పుడూ తళుక్కున మెరుస్తూ నేనింకా జట్టులోనే ఉన్నానని గుర్తుచేసేవాడు. అయితే, అదే సమయంలో దేశవాళీ క్రికెట్లో రాణించిన డీకే తమిళనాడుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. అయితే, నాలుగేళ్ల కిందట నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి ఒక్కసారిగా ప్రత్యేక గుర్తింపు సాధించాడు. దాంతో తన కెరీర్ ఆరంభించిన 15 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత తొలిసారి 2019 వన్డే ప్రపంచకప్కు ఎంపికయ్యాడు. నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లా నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో డీకే చివరి బంతికి సిక్సర్ కొట్టి గెలిపించాడు. ఆఖరి రెండు ఓవర్లలో భారత్ విజయానికి 34 పరుగులు అవసరం కాగా 8 బంతుల్లో 2x4, 3x6 సాయంతో 29 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ముఖ్యంగా రూబెల్ వేసిన 19వ ఓవర్లో రెండు సిక్సులు, రెండు ఫోర్లతో 22 పరుగులు రాబట్టిన అతడు.. మ్యాచ్ ఆఖరి బంతికి 5 పరుగులు అవసరమైన వేళ సిక్సర్తో ఘన విజయాన్ని అందించాడు. దీంతో అప్పుడే తొలిసారి డీకే తనలోని అత్యుత్తమ ఫినిషర్ను ప్రపంచానికి పరిచయం చేశాడు.
2019 సెమీఫైనల్తో ఖేల్ ఖతం..
(Photo: Dinesh Karthik Instagram)
ఆ ఒక్క ఇన్నింగ్స్తోనే డీకే 2019 వన్డే ప్రపంచకప్లో ధోనీ ఉన్నా రెండో వికెట్ కీపర్గా ఎంపికయ్యాడు. తొలుత వీరిద్దరినీ ఎంపిక చేసిన సెలెక్షన్ కమిటీ.. టోర్నీ మధ్యలో ఒక ఆటగాడు గాయపడటంతో రిషభ్ పంత్ను మూడో కీపర్, బ్యాట్స్మన్గా తీసుకుంది. అయితే, ఆ టోర్నీలో డీకేకు పెద్దగా అవకాశాలు రాలేదు. న్యూజిలాండ్తో జరిగిన కీలకమైన సెమీఫైనల్ పోరులో టీమ్ఇండియా అవకాశం ఇచ్చింది. అందులో ధోనీ, పంత్ ఉన్నా కూడా డీకేను అదనపు బ్యాట్స్మన్గా భావించింది. కానీ, అతడిపై పెట్టుకున్న అంచనాల్ని అందుకోలేక విఫలమయ్యాడు. వర్ష ప్రభావం కారణంగా రెండు రోజులు సాగిన ఆ మ్యాచ్లో టీమ్ఇండియా 240 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. దీంతో టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. ఆ పోరులో టాప్ ఆర్డర్తో పాటు పంత్ (32), కార్తీక్ (6) విఫలమవ్వగా.. ధోనీ (50), జడేజా (77) ఏడో వికెట్కు తీవ్రంగా శ్రమించారు. వాళ్లిద్దరూ మ్యాచ్ను గెలిపించేంత పనిచేసినా చివరికి ఓటమి తప్పలేదు. దీంతో కార్తీక్కు టీమ్ఇండియా తరఫున అదే ఆఖరి మ్యాచ్గా మారిపోయింది.
ఆశలు వదులుకొనే స్థాయికి..
(Photo: Dinesh Karthik Instagram)
మరోవైపు భారత టీ20 లీగ్లోనూ తమకు ఫినిషర్గా బాగా పనికొస్తాడని ఆశించిన కోల్కతాకు ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. 2018 వేలంలో కార్తీక్ను కొనుగోలు చేయగా.. ఆ సీజన్లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా రాణించాడు. 16 మ్యాచ్ల్లో 498 పరుగులు సాధించి తొలిసారి ఆ జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. తర్వాత ఆ జట్టులో కీలక ఆటగాడిగా మారడమే కాకుండా కెప్టెన్గానూ ఎంపికయ్యాడు. సారథిగా పెద్దగా విజయవంతం కాకపోయినా కోల్కతా వేచి చూసింది. అదే సమయంలో బ్యాట్స్మన్గానూ చెప్పుకునే స్థాయి ప్రదర్శన లేకపోయింది. దీంతో గత మూడు సీజన్లలో వరుసగా 253, 169, 223 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలోనే గతేడాది కోల్కతా కెప్టెన్గానూ తప్పుకొని బ్యాట్స్మన్గా కొనసాగాడు. అయినా, తన ప్రదర్శనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో అభిమానులతో పాటు జట్టు యాజమాన్యం కూడా ఆశలు వదులుకుంది. దీంతో ఈ సీజన్కు ముందు కోల్కతా వదిలేసుకుంది. అయితే, కార్తీక్ పని అయిపోయిందని అనుకున్నవాళ్లకు ఇప్పుడు అతడు చుక్కలు చూపిస్తున్నాడు.
బెంగళూరు నమ్మకాన్ని కాపాడుకొని..
(Photo: Dinesh Karthik Instagram)
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో బెంగళూరు అతడిని కొనుగోలు చేసింది. ఎవరూ ఊహించని రీతిలో రూ.5.5 కోట్ల ధరకు దక్కించుకుంది. అదేరోజు ఆ జట్టు కోచ్ సంజయ్ బంగర్ డీకేకు ఫోన్ చేసి ఈసారి బెంగళూరు తరఫున ఫినిషర్గా ఆడతావని చెప్పాడు. దీంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న అతడు ఇప్పుడు (32*, 14*, 44*, 7*, 34, 66*) వరుసగా మెరుస్తూ.. ఆ జట్టు విజయాల్లో ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. మరోవైపు ఈ వేలానికి ముందు మళ్లీ టీమ్ఇండియాలో ఆడాలనుకున్న కోరికను ఈ సంచలన బ్యాటింగ్తో నిజం చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకోసం నిబద్ధతతో కొనసాగుతున్నాడు. ఒత్తిడి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. వికెట్ల వెనుక కీపర్గా ఉంటూనే.. బౌలర్లకు, ఫీల్డర్లకు అవసరమైన సూచనలు చేస్తున్నాడు. దీంతో అటు బ్యాట్స్మన్గానే కాకుండా.. కీపర్గా, ఫినిషర్గా రాణిస్తూ బెంగళూరులో ధోనీలా కనిపిస్తున్నాడు. ఇదే విషయాన్ని ఇటీవల ఆ జట్టు సారథి ఫా డుప్లెసిస్ కూడా చెప్పాడు. డీకే.. ధోనీలా ప్రశాంతంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతాడని అన్నాడు. అయితే, కార్తీక్ మున్ముందు కూడా ఇలాగే ఆడితే ఈసారి బెంగళూరు కల నెరివేరినట్టే.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా