Team India: టీమ్ఇండియాకు ఆడాలన్న కసి ఇంకా రగులుతోంది: దినేశ్‌ కార్తీక్‌

ఇప్పుడప్పుడే రిటైర్మెంట్‌ ప్రకటించే ఆలోచన లేదని, మళ్లీ టీమ్‌ఇండియాలో ఆడాలనే కసి ఇంకా రగులుతోందని సీనియర్‌ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు...

Published : 30 Jan 2022 15:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇప్పుడప్పుడే రిటైర్మెంట్‌ ప్రకటించే ఆలోచన లేదని.. మళ్లీ టీమ్‌ఇండియాలో ఆడాలనే కసి ఇంకా రగులుతోందని సీనియర్‌ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన అతడు.. తనకింకా క్రికెట్‌ ఆడాలని ఉందన్నాడు. ముఖ్యంగా టీ20ల్లో రాణించాలని.. అందుకోసం చేయాల్సిందల్లా చేస్తున్నట్లు పేర్కొన్నాడు. అదే తన అల్టిమేట్‌ గోల్‌ అని స్పష్టం చేశాడు. మళ్లీ జట్టులో ఆడేందుకు తానింకా ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు తెలిపాడు. రాబోయే మూడేళ్లు ఇదే పనిలో ఉంటానన్నాడు.

తనకు క్రికెట్‌ ఆడటం చాలా ఇష్టమని, అందుకే ఇప్పటికీ దేశవాళీ క్రికెట్‌లో కొనసాగుతున్నానని డీకే వివరించాడు. ఈ క్రమంలోనే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ, విజయ్‌ హజారే ట్రోఫీల్లో పాల్గొని జట్టును విజయవంతంగా నడిపిస్తున్నట్లు తెలిపాడు. అయితే, టీ20ల్లో ఫినిషర్‌గా తిరిగి రావాలని చూస్తున్నట్లు తన మనసులోని కోరిక వెలిబుచ్చాడు. గతకొంత కాలంగా తాను ఎక్కడ ఆడినా ఆ పాత్రకు తగిన న్యాయం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. అనంతరం గతేడాది కామెంట్రీ చేయడంపై స్పందించిన డీకే.. ఆ కొత్త పాత్రను కూడా ఎంజాయ్ చేసినట్లు వివరించాడు. తాను రిటైరయ్యాక ఇలా క్రికెట్‌ వ్యాఖ్యాతగా కొనసాగాలనుకున్నట్లు చెప్పాడు. అయితే, ఇంకో మూడేళ్ల వరకు ఆటకు వీడ్కోలు పలకనని ఈ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని