షమీ-అక్తర్ ట్విటర్ వార్ : అగ్నికి ఆజ్యం పోయకండి.. పాక్ మాజీ ఆటగాళ్ల అభ్యర్థన
షమీ-అక్తర్ ట్విటర్ వార్ నేపథ్యంలో.. సామాజిక మాధ్యమాల్లో ఎవరూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయొద్దంటూ పాక్ మాజీ ఆటగాళ్లు అభ్యర్థించారు.
ఇంటర్నెట్ డెస్క్ : సెమీస్లో టీమ్ఇండియా దారుణ ఓటమి అనంతరం పాక్ మాజీ ఆటగాళ్లు భారత్పై విమర్శలు ఎక్కుపెట్టి ఎద్దేవా చేస్తే.. ఫైనల్లో పాక్ పరాజయం అనంతరం అదే రీతిలో ఆ జట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో భారత పేసర్ షమీ, పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మధ్య ట్వీట్ల యుద్ధమే జరిగింది. ఒకరికొకరు దీటుగా సమాధానాలిచ్చుకోవడంతో వాతావరణం వేడెక్కింది. దీంతో పాక్ మాజీ ఆటగాళ్లు రంగంలోకి దిగి సామాజిక మాధ్యమాల్లో ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ అభ్యర్థించారు.
షమీ - అక్తర్ ఎపిసోడ్పై పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ స్పందించాడు. భారత్, పాక్ ఆటగాళ్లంతా శాంతంగా ఉండటానికి ప్రయత్నించాలని.. ఇలాంటి ట్విటర్ వార్ మరోసారి జరగకుండా చూసుకోవాలని కోరాడు.
మాజీలైనా, ప్రస్తుత ఆటగాళ్లైనా.. భారత్, పాక్ ఆటగాళ్లు కలిసి ఉండేలా చూడాలి. మన వ్యాఖ్యలు, ట్వీట్లు పాజిటివ్గా ఉండాలి. తటస్థంగా స్పందించాలి. భారత ఆటగాళ్లకు దేశభక్తి ఉంది. మనకూ మన దేశంపై భక్తి ఉంది. ఈ సమయంలో అగ్నికి ఆజ్యం పోయొద్దు. ట్వీట్లపై ట్వీట్లు చేయొద్దు
- పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్
కేవలం కొన్ని లైక్ల కోసం మీరు ఇలాంటివి చేయొద్దు. భారత్, పాక్ ఆటగాళ్లైనా.. మరే దేశ ప్లేయర్లైనా.. మనమంతా ఒక కుటుంబం. ఒకరికొకరం గౌరవించుకోవాలి. అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి’
- పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హాక్
క్రికెటర్లుగా మనమంతా రాయబారులం. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను ఆపేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. అంతే కానీ ప్రజల్లో విద్వేషాలను వ్యాప్తి చేసేలా ఉండకూడదు
- పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది
పాక్ మాజీ ఆటగాళ్లు వకార్ యూనిస్, షోయబ్ మాలిక్లు కూడా ఆటగాళ్లు ఒకరికొకరు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకూడదని కోరారు.
వివాదం ఇలా..
భారత్పై చాలా సార్లు విమర్శలు గుప్పించిన పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్.. ఫైనల్లో పాక్ ఓటమి అనంతరం ట్విటర్లో హృదయం ముక్కలైన ఎమోజీ పెట్టాడు. దీనిపై షమీ స్పందిస్తూ..‘‘సారీ బ్రదర్. దీనినే కర్మ అంటారు’’ అని ట్వీట్ చేశాడు. దీంతో వీరి మధ్య ట్విటర్ వార్ మొదలైంది. అయితే షమీ ట్వీట్కు ప్రతిస్పందనగా షోయబ్ అక్తర్ కూడా ప్రముఖ వ్యాఖ్యాత హర్షాభోగ్లే పాక్ బౌలింగ్ను మెచ్చుకుంటూ చేసిన వ్యాఖ్యలను జత చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో ట్విటర్లో ఈ మాటల యుధ్దాన్ని ఆపాలని పాక్ మాజీ ఆటగాళ్లు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!