Team India: మేం ఆధిక్యంలో ఉన్నామన్న విషయం మర్చిపోవద్దు

ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు మైఖేల్‌ వాన్‌కు టీమ్ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో టీమ్ఇండియా 1-2 తేడాతో ఓటమి...

Published : 15 Jan 2022 21:29 IST

మైఖేల్ వాన్‌కు వసీం జాఫర్‌ అదిరిపోయే రిప్లై

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు మైఖేల్‌ వాన్‌కు టీమ్ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో టీమ్ఇండియా 1-2 తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. భారత్‌కి ఎదురైన ఈ పరాజయాన్ని ఉద్దేశిస్తూ మైఖేల్‌ వాన్‌ ఓ ట్వీట్‌ చేశాడు. ‘గుడ్ ఈవెనింగ్‌ వసీం జాఫర్‌.. బాగానే ఉన్నావా? జస్ట్‌.. ఊరికే అడుగుతున్నానంతే.!’ అని ట్వీట్‌ చేశాడు. దీనిపై స్పందించిన వసీం జాఫర్ దీటుగా బదులిచ్చాడు. ‘అంతా బాగానే ఉంది మైఖేల్‌.. మీ జట్టుపై మేం 2-1 ఆధిక్యంలో ఉన్నామన్న విషయం మర్చిపోవద్దు’ అని సమాధానమిచ్చాడు.

గత ఇంగ్లాండ్‌ పర్యటనలో టీమ్‌ఇండియా అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు నాలుగు టెస్టు మ్యాచులు పూర్తయ్యాయి. ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. అనంతరం లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా 151 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది. మూడో టెస్టులో భారత్‌ 76 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో 1-1తో సిరీస్‌ సమమైంది. ఇక, ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత జట్టు గొప్పగా పుంజుకుంది. ఇంగ్లాండ్‌ను 157 పరుగుల తేడాతో ఓడించి.. ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. అయితే, కరోనా కారణంగా చివరిదైన ఐదో టెస్టు నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు