Bravo - Kohli: కోహ్లీ నంబర్ 1.. గణాంకాలు అబద్ధాలు చెప్పవు: బ్రావో
భారత టీ20 లీగ్లో ఆటగాళ్ల మధ్య అనుబంధాలు ప్రత్యేకంగా ఉంటాయి. మైదానంలో ఎంత పోటీపడినా ఆఫ్ ది ఫీల్డ్లో సోదరభావంతో మెలుగుతారు...
ఇంటర్నెట్డెస్క్: భారత టీ20 లీగ్లో ఆటగాళ్ల మధ్య అనుబంధాలు ప్రత్యేకంగా ఉంటాయి. మైదానంలో ఎంత పోటీపడినా ఆఫ్ ది ఫీల్డ్లో సోదరభావంతో మెలుగుతారు. తాజాగా బెంగళూరు - చెన్నై జట్ల మధ్య జరిగిన పోరులో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ స్టార్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీని మెచ్చుకుంటూ ఓ పోస్టు చేశాడు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడం గమనార్హం.
ప్రస్తుత సీజన్లో కోహ్లీ మునుపటిలా పరుగులు చేయలేక తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో ఒకే ఒక్క అర్ధశతకంతో 216 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడి బ్యాటింగ్పై సందేహాలు తలెత్తుతుండటంతో పాటు అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రావో.. కోహ్లీకి అండగా నిలుస్తూ పోస్టు చేశాడు. అందులో మూడు ఫొటోలు పంచుకున్న అతడు.. ‘జీవితాన్ని ఆస్వాదించండి. అలాగే గొప్ప వ్యక్తుల్ని అభినందించండి. కోహ్లీని గౌరవించండి. అతడో నంబర్ వన్ ఆటగాడు. నంబర్లు అబద్దాలు చెప్పవు. అతడు ఛాంపియన్’ అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. కాగా, దీనికి కోహ్లీ అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. 2 లక్షలపైనే లైకులు వచ్చాయి.
ఇక ఈ టోర్నీలో కోహ్లీ ప్రస్తుతం 218 మ్యాచ్ల్లో 6,499 పరుగులతో కొనసాగుతున్నాడు. దీంతో అత్యధిక పరుగుల వీరుడిగా టాప్లో నిలిచాడు. 36.51 సగటుతో 5 శతకాలు, 43 అర్ధశతకాలు సాధించాడు. అలాగే బ్రావో 159 మ్యాచ్ల్లో 181 వికెట్లు పడగొట్టి.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దూసుకుపోతున్నాడు. ఇక ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడి 14 వికెట్లు సాధించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.