INDvsENG: టీమ్ఇండియాకు కాస్త ఊరట!
టీమ్ఇండియాకు కాస్త ఊరట లభించింది. వచ్చేనెల ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్కు ముందు ‘కౌంటీ సెలెక్ట్ XI’ జట్టుతో ఒక వార్మప్ మ్యాచ్ ఏర్పాటు చేయాలని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు భావిస్తోంది...
లండన్: టీమ్ఇండియాకు కాస్త ఊరట లభించింది. వచ్చేనెల ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్కు ముందు ‘కౌంటీ సెలెక్ట్ XI’ జట్టుతో ఒక వార్మప్ మ్యాచ్ ఏర్పాటు చేయాలని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. అందుకోసం సన్నాహకాలు చేస్తున్నట్లు బోర్డు ప్రతినిధి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ‘‘టెస్టు సిరీస్కు ముందు టీమ్ఇండియాకు ‘కౌంటీ సెలెక్ట్ XI’ జట్టుతో మూడు రోజుల ఫస్ట్క్లాస్ వార్మప్ మ్యాచ్ ఆడించాలని బీసీసీఐ చేసిన అభ్యర్థన మాకు గుర్తుంది. కొవిడ్-19 నియమ, నిబంధనలను దృష్టిలో పెట్టుకొని మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. దీనిపై త్వరలోనే స్పష్టతనిస్తాం. ఇప్పుడు విహార యాత్రలకు వెళ్లిన కోహ్లీసేన జులై 15న దుర్హమ్లోని ఎమిరేట్స్ రివర్సైడ్లో రిపోర్టు చేయనున్నారు. ఆగస్టు 1 వరకు వారక్కడ సన్నద్ధమవుతారు. ఆపై నాటింగ్హామ్లోని ట్రెంట్బ్రిడ్జ్ మైదానానికి చేరుకొని ఆగస్టు 4న తొలి టెస్టు ఆడతారు’ అని ఈసీబీ ప్రతినిధి చెప్పుకొచ్చారు.
అలాగే జులై 23 నుంచి ‘ది హండ్రెడ్’ లీగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ‘కౌంటీ సెలెక్ట్ XI’ జట్టులో ఎలాంటి ఆటగాళ్లు ఉంటారని మీడియా అడిగిన ప్రశ్నకు..‘ది హండ్రెడ్ లీగ్’లో ఆడని ఆటగాళ్లే భారత జట్టుతో తలపడతారని, అందులో నాణ్యమైన ఆటగాళ్లనే ఎంపికచేస్తామని ఆయన బదులిచ్చారు. మరోవైపు గతనెల జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ఇండియా ఓటమిపాలైన నేపథ్యంలో.. అప్పుడు భారత జట్టుకు సరైన ప్రాక్టీస్ లభించలేదని, ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్తో పెద్దగా ఉపయోగం లేదని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే తేరుకున్న బీసీసీఐ ఇప్పుడు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్కు ముందు ఓ ఫస్ట్క్లాస్ మ్యాచ్ను ఏర్పాటు చేయాలని ఈసీబీని కోరింది. దాంతో ఆ బోర్డు ‘కౌంటీ సెలెక్ట్ XI జట్టు’తో ఆడించాలని నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!