Eng vs Ind: కోహ్లీ ఆట గురించి మాకు తెలుసు..బయట వ్యక్తుల మాటలు మేము పట్టించుకోము: రోహిత్ శర్మ
ఫేలవ ఫామ్తో ఇబ్బందిపడుతున్న విరాట్ కోహ్లీ..తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లోనూ విఫలం అయ్యాడు. రెండో టీ20లో భారీ
ఇంటర్నెట్ డెస్క్: పేలవమైన ఫామ్తో ఇబ్బందిపడుతున్న విరాట్ కోహ్లీ.. తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లోనూ విఫలం అయ్యాడు. సిరీస్ రెండో మ్యాచ్లో భారీ షాట్కి ప్రయత్నించి వికెట్ సమర్పించుకొన్నాడు. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్లో డేవిడ్ విల్లీ బౌలింగ్లో ఫ్లిక్ షాట్తో ఫోర్, స్ట్రయిట్ సిక్స్ కొట్టి ఫామ్లోకి వచ్చినట్లు కనిపించాడు. అయితే, దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఆ తర్వాతి బంతికే రాయ్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండు మ్యాచ్ల్లో కలిపి కేవలం 12పరుగులే చేయడం అభిమానులను నిరాశపర్చింది. మూడో మ్యాచ్లో భారత్ 17 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. అయితే, అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. ముఖ్యంగా జట్టులో మార్పులు, విరాట్ ఫామ్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘టీమ్ఇండియా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో మేము పట్టించుకోవడం లేదు. అసలు నిపుణులెవరో నాకు తెలియదు. వారిని ఎందుకు అలా పిలుస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. వారు బయట నుంచి చూస్తున్నారు. టీమ్ఇండియాలో ఏమి జరుగుతుందో వారికి తెలియదు. మేము ప్రపంచకప్ లక్ష్యంగా ఒక జట్టును తయారు చేసుకొంటున్నాం. అనేకసార్లు చర్చించిన అనంతరమే మార్పులపై నిర్ణయాలు తీసుకుంటోన్నాము. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నాము. ఈ విషయాలన్నీ బయట వారికి తెలియవు’’ అని రోహిత్ సమాధానమిచ్చాడు.
విరాట్ ఫామ్ గురించి మాట్లాడుతూ..‘‘ప్రతి ఆటగాడు ఏదో ఒక సమయంలో ఫామ్ కోల్పోతాడు. ఆ తర్వాత పుంజుకొని తిరిగి ఫామ్లోకి వస్తాడు. అయితే, ఆటగాడి నాణ్యత ఎప్పుడూ తగ్గదు. కోహ్లీ ఫామ్కి సంబంధించి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నేను కూడా ఒక దశలో ఫామ్ కోల్పోయాను. చాలా మంది ఆటగాళ్లకు ఈ విధంగా జరిగింది. ఇదేమీ కొత్త కాదు. ఎంతోకాలంగా నిలకడగా రాణిస్తున్న ఆటగాడు ఒకటి లేదా రెండేళ్ల పాటు పరుగులు సాధించలేకపోతే అలా మాట్లాడకూడదు. అభిమానులు దీన్ని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. కానీ, జట్టును నడుపుతున్న వారికి ఆ ఆటగాడి అవసరం, నాణ్యత తెలుసు’’ అని రోహిత్ విరాట్కు మద్దతిచ్చాడు.
కోహ్లీ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించడం (కోహ్లీ వ్యక్తిగత నిర్ణయమా? లేదా జట్టు యాజమాన్యం సూచనా?) అని అడిగినప్పుడు రోహిత్ స్పందిస్తూ..‘‘మేము ఒక నిర్దిష్టమైన విధానంలో ఆడాలనుకొన్నాము. దానికి ప్రతి ఆటగాడి సహకారం అవసరం. అలా అయితేనే ఫలితం సానుకూలంగా వస్తుంది. ఈ జట్టులో భాగమైన ఆటగాళ్లు అదనపు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సిరీస్లో మేము ఆ విధంగానే ఆడి గెలిచాము. ఈ ఆలోచనా విధానంతోనే టీమ్ఇండియా రాబోయే సిరీస్ల్లో కూడా ఆడుతుంది’ అని రోహిత్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?