అక్షర్ ‘6’ విన్యాసం.. ఇంగ్లాండ్ విలవిల
టీమ్ఇండియా అదరగొట్టింది. మొతెరాను మోతెక్కించింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంలో జరుగుతున్న తొలి డే/నైట్ టెస్టులో ఇంగ్లాండ్ను విలవిల్లాడించింది. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టును 112 పరుగులకే ఆలౌట్ చేసింది. యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఆరు వికెట్లతో ఆంగ్లేయులను వణికించాడు....
తొలి ఇన్నింగ్స్లో రూట్సేన 112 ఆలౌట్
మొతెరాలో టీమ్ఇండియా దుమ్మురేపింది. మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్ను ఓ ఆటాడుకుంది. ‘గులాబి చెర్రీ’ని గింగిరాలు తిప్పుతూ అక్షర్ పటేల్ మరోసారి ‘5+’ వికెట్ల విన్యాసం ప్రదర్శించాడు. అతడికి అశ్విన్ (3 వికెట్లు) తోడవ్వడంతో ఇంగ్లిష్ జట్టు డే/నైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 112కు ఆలౌటైంది. ఇంగ్లాండ్ జట్టులో జాక్ క్రాలీ (53; 84 బంతుల్లో 10×4) టాప్ స్కోరర్.
లంబూతో ఆరంభం
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. కఠిన ప్రత్యర్థితో గులాబి పోరు. తన కెరీర్లో వందో టెస్టు. ఇంకేముంది ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్ను మరింత వేడుకగా మార్చుకున్నాడు సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ. జట్టు స్కోరు రెండు పరుగుల వద్దే ఇంగ్లాండ్ ఓపెనర్ డామ్ సిబ్లి (0)ని పెవిలియన్ పంపించి టీమ్ఇండియాకు శుభారంభం అందించాడు. వేగంగా ఆడుతున్న మరో ఓపెనర్ జాక్ క్రాలీ (53; 84 బంతుల్లో 10×4)కు అండగా నిలిచిన జానీ బెయిర్స్టోను అక్షర్ పటేల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకొని రెండో వికెట్ పడగొట్టాడు. అయితే కెప్టెన్ జో రూట్ (17; 37 బంతుల్లో)తో కలిసి క్రాలీ మూడో వికెట్కు 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
అక్షర్ 6, అశ్విన్ 3
ఇంగ్లాండ్ ఆటగాళ్లు నిలదొక్కుకుంటున్న సమయంలో అశ్విన్ తెలివైన ఎత్తుగడతో జోరూట్ను పెవిలియన్కు పంపించాడు. ఫుల్లర్ లెంగ్త్ బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకొన్నాడు. రూట్ సమీక్ష కోరినా ఫలితం లేకుండా పోయింది. అప్పుడు స్కోరు 74/3. మరికాసేపటికే అర్ధశతక వీరుడు జాక్ క్రాలీని అక్షర్ పటేల్ బోల్తా కొట్టించడంతో ఇంగ్లాండ్ 81/4తో భోజన విరామానికి వెళ్లింది. ఆ తర్వాత అక్షర్ అద్భుతం చేశాడు. సొంతమైదానంలో ఆడుతున్న అతడు తన అనుభవాన్ని ఉపయోగించుకున్నాడు. భిన్నమైన కోణాల్లో బంతులు విసురుతూ ఇంగ్లాండ్ ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీశాడు. బెన్స్టోక్స్ (6), బెన్ఫోక్స్ (12), జోఫ్రా ఆర్చర్ (11), స్టువర్ట్ బ్రాడ్ (3)ను పెవిలియన్కు పంపించి వరుసగా రెండో టెస్టులో ‘5+’ వికెట్ల ఘనత అందుకున్నాడు. అతడి ధాటికి ఆంగ్లేయులు వందలోపే చాపచుట్టేస్తారనిపించింది. మరోవైపు ఒలీ పోప్ (1), జాక్లీచ్ (3)ను యాష్ ఔట్ చేశాడు. తొలిరోజే తమకు అనుకూలించిన పిచ్ను ఉపయోగించుకొన్న స్పిన్నర్లు 9 వికెట్లు తీసి ఇంగ్లాండ్ను 112కు పరిమితం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడును మళ్లీ చూస్తామా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడును మళ్లీ చూస్తామా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్