INDW vs ENGW : ప్రపంచకప్లో టీమ్ఇండియాకు రెండో ఓటమి.. బోణీ కొట్టిన ఇంగ్లాండ్
మహిళల ప్రపంచకప్లో టీమ్ఇండియాకు రెండో ఓటమి ఎదురైంది. ఇప్పటి వరకు..
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రపంచకప్లో టీమ్ఇండియాకు రెండో ఓటమి ఎదురైంది. ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో బోణీ కొట్టని ఇంగ్లాండ్ తొలి విజయం నమోదు చేసుకుంది. మౌంట్ మౌంగనీయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్పై ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుని భారత్కు బ్యాటింగ్ అప్పగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 36.2 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో 31.2 ఓవర్లలో ఆరు వికెట్లను నష్టపోయి 136 పరుగులు చేసి ఇంగ్లాండ్ గెలుపొందింది. భారత బౌలర్లలో మేఘ్న సింగ్ 3.. ఝులన్ గోస్వామి, రాజేశ్వరి, పూజ వస్త్రాకర్ తలో వికెట్ తీశారు.
ఆరంభంలోనే అదుర్స్.. చివర్లో కంగారు పెట్టినా
భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఆదిలోనే తడబడింది. మేఘ్న సింగ్, ఝులన్ గోస్వామి చెలరేగడంతో ఇంగ్లాండ్ ఓపెనర్లు టామీ బ్యూమౌంట్ (1), వ్యాట్ (1) త్వరగా పెవిలియన్కు చేరారు. అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ హీథెర్ నైట్ (53*) అద్భుతమైన అర్ధశతకంతో జట్టును విజయతీరాలకు చేర్చింది. నైట్కు తోడుగా నటాలీ స్కివెర్ (45) చక్కని తోడ్పాటు అందించింది. వీరిద్దరూ కలిసి 65 పరుగులు జోడించారు. నటాలీ ఔటైనప్పటికీ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎలెన్ (10), సోఫియా (17), సోఫీ (5*)తో కలిసి కెప్టెన్ నైట్ జట్టును గెలిపించింది. చివర్లో మేఘ్న సింగ్ వరుసగా రెండు వికెట్లు తీసినా అప్పటికే ఆలస్యమైంది. దీంతో ప్రపంచకప్లో రెండు విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో భారత్ (4) మూడో స్థానంలో కొనసాగుతోంది. టీమ్ఇండియా తదుపరి మ్యాచ్ను మార్చి 19న ఆసీస్తో తలపడనుంది.
ఎనిమిదో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం
టీమ్ఇండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. స్మృతీ మంధాన (35), రిచా ఘోష్ (33), ఝులన్ గోస్వామి (20) కాస్త ఫర్వాలేదనిపించారు. యాస్తిక భాటియా 8, మిథాలీరాజ్ 1, హర్మన్ ప్రీత్ కౌర్ 14, పూజ వస్త్రాకర్ 6, మేఘ్న సింగ్ 3* పరుగులు చేశారు. దీప్తి శర్మ, స్నేహ్ రాణా డకౌట్గా వెనుదిరిగారు. 28 పరుగులకే మూడు వికెట్లను కోల్పోగా.. ఓపెనర్ స్మృతీ మంధాన-హర్మన్ ప్రీత్ కలిసి 33 పరుగులు జోడించారు. హర్మన్ ఔటైన తర్వాత స్వల్ప వ్యవధిలో స్నేహ్ రాణా, స్మృతీ మంధాన, పూజ వికెట్లను భారత్ చేజార్చుకుంది. అయితే 86/7తో ఉన్న టీమ్ఇండియా 134 పరుగులు చేసేందంటే రిచా ఘోష్-ఝులన్ జోడీనే కారణం. వీరిద్దరూ ఎనిమిదో వికెట్కు 37 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఈ మ్యాచ్లో భారత్ తరఫున ఇదే భారీ భాగస్వామ్యం కావడం విశేషం. ఇంగ్లాండ్ బౌలర్లలో డీన్ 4, అన్య ష్రుబ్సోలె 2.. సోఫీ, కేట్ క్రాస్ చెరో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ