FIFA World Cup: సెనెగల్ను ఓడించి క్వార్టర్స్కు ఇంగ్లాండ్.. ఫ్రాన్స్తో ఇక అమీతుమీ
ప్రీక్వార్టర్స్లో సెనెగల్పై పూర్తి ఆధిపత్యం సాధించిన ఇంగ్లాండ్ జట్టు 3-0 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది.
(Photo: FIFA Twitter)
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో భాగంగా నాకౌట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు అదరగొట్టింది. ప్రీక్వార్టర్స్లో సెనెగల్పై పూర్తి ఆధిపత్యం సాధించిన ఇంగ్లాండ్ జట్టు 3-0 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఇక క్వార్టర్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. డిసెంబర్ 11న ఇంగ్లాండ్-ఫ్రాన్స్ జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ జరగనుంది. ఈ పోరులో ఎవరు గెలిస్తే వారు సెమీస్కు దూసుకెళతారు.
మ్యాచ్లో ఎక్కువ శాతం బంతిని తన ఆధిపత్యంలోనే ఉంచుకున్న ఇంగ్లాండ్ జట్టు సెనెగల్ను ఒక్క గోల్ చేయకుండా అడ్డుకుంది. తొలి అర్ధభాగంలో 38 నిమిషాల వద్ద జుడె బెల్లింగమ్ నుంచి పాస్ అందుకున్న జోర్డాన్ అద్భుత రీతిలో గోల్గా మలిచి తమ జట్టును 1-0 తేడాతో అధిక్యంలో నిలిపాడు. ఇక తొలి అర్ధభాగం అదనపు సమయంలో ఫిల్ ఫోడెన్ నుంచి పాస్ అందుకుని హారీ కేన్ గోల్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 2-0 తేడాతో మరింత ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఆట ప్రారంభంలో బంతిని తమ నియంత్రణలో ఉంచుకున్న సెనెగల్ ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. పలుసార్లు గోల్ పోస్టువైపు దూసుకుపోయినప్పటికీ ఇంగ్లాండ్ డిఫెండర్లు బలంగా అడ్డుకున్నారు. ఇక రెండో అర్ధభాగంలో 57 నిమిషాల వద్ద బుకాయో సాక గోల్ కొట్టి బ్రిటీష్ జట్టును 3-0 తేడాతో మరింత ముందుకు తీసుకెళ్లాడు. ఇక సెనెగల్ జట్టు చివరి వరకు పోరాడినప్పటికీ ఒక్కగోల్ కూడా చేయలేక ఓటమి మూటగట్టుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు