CWG 2022 : కామన్వెల్త్ నుంచి తప్పుకొన్న ఇంగ్లాండ్ కెప్టెన్.. భారత్కు ఊరట!
కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళల క్రికెట్ జట్టుకు ఊరటనిచ్చే వార్త. ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్ గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్లో...
(ఫొటో సోర్స్: ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళల క్రికెట్ జట్టుకు ఊరటనిచ్చే వార్త. ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్ గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్లో మహిళల క్రికెట్ సెమీఫైనల్ మ్యాచ్కు దూరమైంది. మరి టీమ్ఇండియాకు సంబంధం ఏంటంటారా...? కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ సెమీస్లో ఇంగ్లాండ్తోనే భారత్ శనివారం (భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు) తలపడనుంది. గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్నూ నైట్ ఆడలేకపోయింది. అయితే గాయం తీవ్రతను పరిశీలించిన వైద్యబృందం విశ్రాంతి అవసరమని సూచించడంతో నైట్ కామన్వెల్త్ టీమ్ నుంచి వైదొలగింది. ఆమె స్థానంలో నటాలీ స్కివెర్ సారథ్య బాధ్యతలు చేపట్టింది. ఇంగ్లాండ్ను విజయవంతంగా నడిపించే హీథర్ లేకపోవడం కీలకమైన సెమీస్ పోరులో ఆ జట్టుకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.
‘‘కామన్వెల్త్ గేమ్స్లో నటాలీ స్కివెర్ ఇంగ్లాండ్కు కెప్టెన్గా వ్యవహరిస్తుంది. గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగిన హీథర్ నైట్ స్థానంలో మరో ప్లేయర్ని తీసుకోవడం లేదు. 14 మంది స్క్వాడ్తోనే ఇంగ్లాండ్ మిగతా మ్యాచ్లకు కొనసాగుతుంది’’ అని ఇంగ్లాండ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది. హీథర్ నైట్ ఇప్పుడు జరుగుతోన్న కామన్వెల్త్ నుంచే కాకుండా డొమెస్టిక్ లీగ్ ‘100’ టోర్నమెంట్ నుంచి కూడా తప్పుకొంది. కామన్వెల్త్ గేమ్స్లో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్ల్లోనూ విజయం సాధించి గ్రూప్-Bలో అగ్రస్థానం దక్కించుకుంది. దీంతో గ్రూప్-Aలో రెండో స్థానంలో ఉన్న టీమ్ఇండియాతో సెమీస్ పోరులో తలపడనుంది. హర్మన్ప్రీత్ నాయకత్వంలోని భారత్ ఆసీస్ మీద ఓడి మిగిలిన రెండు మ్యాచుల్లో (పాక్, బార్బడోస్) విజయం సాధించి సెమీస్కు చేరుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.