భారత్‌కే ‘ఫైనల్‌’ అవకాశం: ఇంగ్లాండ్‌ ఎలిమినేట్‌

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటికే 70% విజయాల రేటుతో ఫైనల్‌ చేరుకున్న న్యూజిలాండ్‌ను అధిగమించింది. ప్రస్తుతం 71% విజయాల రేటు, 490 పాయింట్లతో నంబర్‌వన్‌గా అవతరించింది. తాజా అపజయంతో ఇంగ్లాండ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌....

Published : 26 Feb 2021 01:17 IST

(Image: BCCI)

దుబాయ్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటికే 70% విజయాల రేటుతో ఫైనల్‌ చేరుకున్న న్యూజిలాండ్‌ను అధిగమించింది. ప్రస్తుతం 71% విజయాల రేటు, 490 పాయింట్లతో నంబర్‌వన్‌గా అవతరించింది. తాజా అపజయంతో ఇంగ్లాండ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అర్హత రేసులోంచి నిష్క్రమించింది.

మొతేరా వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 49 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేన సునాయాసంగా ఛేదించింది. యువ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ 11, అశ్విన్‌ 7 వికెట్లతో ఇంగ్లాండ్‌ను దెబ్బకొట్టారు. ఈ ఓటమితో ఇంగ్లిష్‌ జట్టు సిరీసులో 1-2తో వెనకబడింది. ఫలితంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు దూరమైంది.

ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించే అవకాశాలు రెండు జట్లకే ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టును గెలిచినా డ్రా చేసుకున్నా భారత్‌ 2-1 లేదా 3-1తో ఫైనల్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఇంగ్లాండ్‌ గెలిస్తే 2-2 సిరీస్‌ సమం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాను అదృష్టం వరిస్తుంది. అప్పుడు ఆసీస్‌తో కివీస్‌‌ పోరాడాల్సి వస్తుంది. అయితే ఇలా జరిగే అవకాశాలు తక్కువ. కోహ్లీసేన నాలుగో టెస్టును డ్రా చేసుకోగలదు!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని