WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. టీమ్ఇండియా ఆ ఒక్క మార్పు చేస్తే చాలు: మైకెల్ వాన్
వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాపింయన్షిప్ ఫైనల్కు (WTC Final) దూసుకెళ్లిన టీమ్ఇండియాకు కఠిన పరీక్ష మాత్రం తప్పదు. ఫాస్ట్బౌలింగ్కు అనుకూలంగా ఉండే లండన్లోని ఓవల్ మైదానంలో ఆసీస్ను ఢీకొట్టాలంటే కఠినంగా శ్రమించాల్సిందే.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఐపీఎల్ (IPL) మెగా టోర్నీ జరుగుతోంది. ఇది ముగిశాక జూన్ 7వ తేదీ నుంచి టీమ్ఇండియా లండన్లోని ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC Final) ఫైనల్లో తలపడనుంది. ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. చాలా రోజుల తర్వాత అజింక్య రహానెకు అవకాశం దక్కగా.. సూర్యకుమార్ను తప్పించింది. అయితే కేఎల్ రాహుల్కు మాత్రం అవకాశం రావడం గమనార్హం. కేఎల్ కూడా మొన్నటి వరకు పెద్దగా ఫామ్లో లేడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ పలు కీలక సూచనలు చేశాడు. ఓవల్ బంతి గమనం డిఫరెంట్గా ఉంటుందని, యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ ఓపెనర్గా అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం కష్టమని పేర్కొన్నాడు. అందుకే, సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ను రోహిత్తోపాటు ఓపెనింగ్ చేయిస్తే మంచిదని సూచించాడు.
‘‘ఓవల్ పిచ్ పరిస్థితికి అనుగుణంగా భారత తుది జట్టులో ఒకే ఒక్క మార్పు చేస్తే సరిపోతుంది. ఈ ఒక్క మ్యాచ్లో విజయం సాధించడం చాలా ముఖ్యం. గతంలో ఏం జరిగిందనేది మరిచిపోవాలి. ఆసీస్తో జరిగే మ్యాచ్లో బ్యాటింగ్ ఆర్డర్ను మార్చుకుంటే బెటర్. శుభ్మన్ గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్గా పంపించాలి. అత్యుత్తమ తుది జట్టుతో బరిలోకి దిగడమే కాకుండా పదునైన వ్యూహాలను అమలు చేయాలి. బంతి నేరుగా బ్యాట్ మీదకు వస్తుంటే మాత్రం శుభ్మన్ గిల్ చాలా ప్రమాదకారి. అయితే, ఓవల్లో బాల్ కదలిక విభిన్నంగా ఉంటుంది. అందుకే, టెక్నికల్గా గిల్ కంటే ఉత్తమంగా ఉండే కేఎల్ రాహుల్ను రోహిత్కు జతగా పంపించాలి. ఇలాగే చేయాలని చెప్పగలను కానీ, నేనేమీ తుది నిర్ణయం తీసుకోలేను. తుది జట్టు ఎంపిక మాత్రం కేవలం ఈ ఒక్క మ్యాచ్కే పరిమితం కావాలి. తర్వాత వెస్టిండీస్ పర్యటనను దృష్టిలో పెట్టుకొని ఆటగాళ్లను ఆడించడం సరైన నిర్ణయం అనిపించదు’’ అని మైకెల్ వాన్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM