WTC Final: పిచ్ ఎలా ఉన్నా.. భారత్ మాత్రం ఆ పొరపాటు చేయకూడదు: నాసిర్ హుస్సేన్
భారత్ తన తుది జట్టు ఎంపికపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ హెచ్చరించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో (WTC Final) గెలవాలంటే తప్పదని స్పష్టం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ (WTC Final)కు చేరింది. బుధవారం నుంచి ఆసీస్తో తలపడేందుకు సిద్ధమవుతోంది. గత డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్పై న్యూజిలాండ్ విజయం సాధించింది. వర్షం వల్ల పిచ్ బౌలింగ్కు అనుకూలంగా మారినప్పటికీ.. స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు ఫలితం అనుకూలంగా రాలేదు. అశ్విన్, రవీంద్ర జడేజా విఫలం కావడం భారత్ ఓటమికి ప్రధాన కారణం. అదనంగా పేసర్ లేకపోవడం కూడా టీమ్ఇండియాకు కలిసిరాలేదు. ఈసారి కూడా ఇంగ్లాండ్ వేదిక కావడంతో పిచ్ పేస్కు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ స్పిన్నర్లకూ సహకరిస్తుందనే వాదనా ఉంది. దీంతో తుది జట్టు కూర్పుపై మాజీలు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ సున్నితంగా హెచ్చరించాడు. ఆసీస్ను వారి దేశంలోనే ఓడించిన భారత్.. ఎలాంటి పిచ్లపైనైనా గెలవగలదని వ్యాఖ్యానించాడు.
‘‘వాతావరణం బాగుండి.. ఎండ ఎక్కువగా ఉంటే తన రెగ్యులర్ ఫార్ములాతోనే టీమ్ఇండియా బరిలోకి దిగుతుంది. ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లతోపాటు మూడో పేసర్గా శార్దూల్ ఠాకూర్ను తీసుకొనే వీలుంది. ఎండ ఉండటం వల్ల పేస్, స్పిన్కు పిచ్ సమానంగా అనుకూలించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే, గత డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ను ఓసారి గుర్తు చేసుకుంటే.. అప్పటి పిచ్ పరిస్థితులను టీమ్ఇండియా తప్పుగా అర్థం చేసుకున్నట్లు అనిపించింది. ఐదు రోజులూ లైట్లు ఆన్లోనే (వర్షం వల్ల) ఉన్నాయి. తేమ వాతావరణం ఉంది. అందుకే, కివీస్ ప్రధాన స్పిన్నర్తో కూడా బరిలోకి దిగలేదు. అయితే, భారత్ మాత్రం ఇద్దరు స్పిన్నర్లతో ఆడింది. సీమ్, స్వింగ్ ప్రభావం చూపిన పిచ్పై అలా తుది జట్టును ఎంపిక చేసుకుంది. ఈ సారి అలాంటి పొరపాటును పునరావృతం చేయకూడదు.
గతంలో ఓవల్ మైదానంలో భారత్ నాణ్యమైన క్రికెట్ను ఆడింది. ఇంగ్లాండ్ను ఓడించింది. అందుకే, ఇప్పుడు ఓవల్ మైదానం మంచి వేదికగా నిలుస్తుందని భావిస్తున్నా. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లు బంతితో పాటు తమ వంతు బ్యాటింగ్ సహకారం కూడా అందిస్తారు. కానీ, పిచ్ పరిస్థితిని బట్టి పేసర్లకే ఎక్కువ సహకారం లభిస్తున్నట్లు ఉంది. అందుకే, సీమర్లను తీసుకోవాలని చెబుతా. ఇంగ్లాండ్ మీద జడేజా అత్యుత్తమ బౌలింగ్ వేశాడు. మ్యాచ్ ఆరంభమయ్యే సమయానికి పిచ్, వాతావరణం పరిస్థితులను సరిగా అంచనా వేసి తుది జట్టును ఎంపిక చేసుకోవాలి. పరిస్థితులు డిమాండ్ చేస్తే.. ఇద్దరు టాప్ స్పిన్నర్లలో ఒకరు బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది. గొప్ప బౌలర్లు.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాణ్యంగా బౌలింగ్ చేయగలరు. కానీ ఇది డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్. ఏమాత్రం అజాగ్రత్త వహించకూడదు’’ అని నాసిర్ హుస్సేన్ సూచించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు