అహ్మదాబాద్ను అడిలైడ్గా భ్రమపడ్డ ఇంగ్లాండ్!
మొతేరాలో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ను ఆ జట్టు మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్కాట్ తీవ్రంగా విమర్శించాడు. దాని ఫలితమే పది వికెట్ల తేడాతో పరాజయమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. గులాబి టెస్టును అహ్మదాబాద్లో కాకుండా అడిలైడ్లో ఆడుతున్నామని ఇంగ్లిష్ జట్టు భావించిందని....
ఇంగ్లిష్ జట్టు సిగ్గుపడాలన్న జెఫ్రీ బాయ్కాట్
ఇంటర్నెట్ డెస్క్: మొతేరాలో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ను ఆ జట్టు మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్కాట్ తీవ్రంగా విమర్శించాడు. దాని ఫలితమే పది వికెట్ల తేడాతో పరాజయమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. గులాబి టెస్టును అహ్మదాబాద్లో కాకుండా అడిలైడ్లో ఆడుతున్నామని ఇంగ్లిష్ జట్టు భావించిందని పేర్కొన్నాడు.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన గులాబి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో టీమ్ఇండియా ముగ్గురు స్పిన్నర్లు అశ్విన్, అక్షర్, సుందర్ ఇద్దరు పేసర్లు ఇషాంత్, బుమ్రాతో బరిలోకి దిగింది. అయితే ఇంగ్లాండ్ మాత్రం ముగ్గురు పేసర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్, ఒక స్పెషలిస్టు స్పిన్నర్ జాక్లీచ్ను ఎంపిక చేసింది. దాంతో కోహ్లీసేన ఎక్కువగా స్పిన్నర్లను ఉపయోగించుకోగా ఆంగ్లేయులకు ఆ అవకాశం లేకుండా పోయింది.
మూడో టెస్టులో ప్రదర్శన పట్ల ఇంగ్లాండ్ సిగ్గుపడాలని బాయ్కాట్ విమర్శించాడు. ‘టర్నింగ్ పిచ్పై ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలన్న అద్భుత ఆలోచన ఎవరిదో తెలుసుకోవాలని అనుకుంటున్నా. వారిందుకు సిగ్గుపడాలి. ఇంగ్లిష్ జట్టు గులాబి టెస్టును అహ్మదాబాద్లో కాకుండా అడిలైడ్లో ఆడుతున్నామని భ్రమపడి ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు. అయితే అంతకు ముందు ‘గులాబి బంతి టెస్టులో బంతిని స్వింగ్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాం’ అని ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!