నాటింగ్‌హామ్ టెస్టు: భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్ 61/2

టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ భోజన విరామ

Published : 04 Aug 2021 18:05 IST


ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ భోజన విరామ సమయానికి 25 ఓవర్లలో 61/2 స్కోర్‌ సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన  ఇంగ్లాండ్‌కు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ రోరీ బర్న్స్‌(0)ను బుమ్రా ఎల్బీడబ్ల్యూగా పెలివియన్‌కు పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జాక్ క్రాలే(27)తో కలిసి మరో ఓపెనర్‌ సిబ్లీ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు.  ఈ క్రమంలో సిరాజ్‌ వేసిన 21వ ఓవర్లో చివరి బంతికి జాక్‌ క్రాలే రిషభ్ పంత్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం జో రూట్‌ (12), డొమినిక్‌ సిబ్లీ(18) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని