T20 వరల్డ్‌ కప్: ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్‌ విజయం

సూపర్‌ 12లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఐర్లాండ్‌ ఓడించింది. డక్‌ వర్త్‌ లూయిస్ పద్ధతిలో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది.

Updated : 26 Oct 2022 15:04 IST

(ఫొటో : ఐసీసీ ట్విటర్‌)

మెల్‌బోర్న్‌: టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. సూపర్‌ 12లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఐర్లాండ్‌ ఓడించింది. డక్‌ వర్త్‌ లూయిస్ పద్ధతిలో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ 19.2 ఓవర్లకు  157 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ 14.3 ఓవర్లకు 105/5 స్కోర్‌ చేసింది. ఈక్రమంలో వర్షం కురవడంతో డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 5 పరుగుల తేడాతో ఐర్లాండ్ గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు.

ఐర్లాండ్‌ జట్టులో కెప్టెన్‌ బాల్‌బిర్ని 62, టక్కర్‌ 34 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌లో డేవిడ్‌ మలన్‌ 35 పరుగులు చేయగా.. మొయిన్‌ అలీ 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని