IND vs ENG: ఇంగ్లాండ్ ఓపెనర్లే కొట్టేశారు.. సెమీస్లో టీమ్ఇండియా చిత్తు
టీ20 ప్రపంచకప్లో భారత్ కథ ముగిసింది. సెమీస్ పోరులో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. బౌలింగ్లో ఘోరంగా విఫలమైన టీమ్ఇండియా పది వికెట్ల తేడాతో ఓడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
అడిలైడ్: మరోసారి 2007 టీ20 ప్రపంచకప్ పునరావృతమవుతుందని అంతా ఆశగా చూశారు. ఫైనల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను చూడాలని వేయి కళ్లతో ఎదురు చూశారు. అనుకొన్నట్లుగానే పాకిస్థాన్ ఫైనల్కు చేరింది. ఇక భారత్ కూడా ఇంగ్లాండ్ను ఓడించి పాక్ను ఢీ కొడుతుందని భావించిన క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తూ.. ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకొని ఇంటిముఖం పట్టింది.
రెండో సెమీస్లో భారత్పై ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టోర్నీ ఆసాంతం ఓ ఇద్దరు బ్యాటర్లపైనే ఆధారపడిన భారత్ను బౌలర్లు ఎలాగోలా కాపాడుతూ వచ్చారు. అయితే కీలకమైన మ్యాచ్లో మాత్రం ఇంగ్లాండ్ వికెట్ తీయడానికి నానా తంటాలు పడ్డారు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేక చేతులెత్తేశారు. భారత్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్య ఛేదనను ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 16 ఓవర్లలోనే పూర్తి చేసేసింది. దీంతో నవంబర్ 13న మెల్బోర్న్ వేదికగా జరిగే ఫైనల్లో పాకిస్థాన్తో ఇంగ్లాండ్ తలపడనుంది.
కొనసాగిన ఓపెనర్ల వైఫల్యం
గ్రూప్ స్టేజ్లో ఓపెనర్లు విఫలమైతే అభిమానులు సర్దుకుపోయారు. కీలకమైన నాకౌట్ దశలోనూ అదే ఆటతీరుతో మరోసారి నిరుత్సాహానికి గురి చేశారు. అడిలైడ్ మైదానం బ్యాటింగ్కు మరీ అనుకూలించనంత స్థాయిలో ఏమీలేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ (50), హార్దిక్ పాండ్య (63) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అలాగే రోహిత్ శర్మ (27) కూడా కుదురుకొన్నట్లే కనిపించాడు. కానీ మరోసారి తన బలహీనతను బయటపెట్టి అప్పనంగా ఇంగ్లాండ్కు వికెట్ను సమర్పించాడు. ఇదే కోవలోకి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (5) వస్తాడు. బౌండరీతో ఖాతా తెరిచిన రాహుల్ గత రెండు మ్యాచుల్లోని ఫామ్ను కొనసాగిస్తాడని అంతా భావించారు. అయితే ఓ చెత్త షాట్కు ప్రయత్నించి పెవిలియన్కు చేరాడు. మిస్టర్ 360 సూర్యకుమార్ ఓ రెండు షాట్లు కొట్టాడు కానీ.. ఇంగ్లాండ్ తెలివిగా బౌలింగ్ చేసి అతడిని కట్టడి చేసింది. పంత్ (6) కూడా పెద్ద ప్రభావం చూపలేదు. చివర్లో వచ్చి ధాటిగా ఆడలేకపోయాడు. విరాట్, పాండ్య ఆమాత్రం ఆడకపోతే భారత్ ఇంకా తక్కువ స్కోరుకే పరిమితమై ఉండేది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ (4008 పరుగులు) అంతర్జాతయ టీ20ల్లో 4వేల మార్క్ను దాటిన బ్యాటర్గా రికార్డు సృష్టించాడు.
బౌలర్లు మరింత ఘోరం
ఇంగ్లాండ్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (86*), జోస్ బట్లర్ (80*) ఎలా ఆడతారో తెలుసు. అయినప్పటికీ కనీసం వారిని అడ్డుకొనేలా బంతులను సంధించడంతో భారత పేసర్లు, స్పిన్నర్లు ఘోరంగా విఫలమయ్యారు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ ఎలాంటి ఒత్తిడి లేకుండా లక్ష్య ఛేదనను పూర్తి చేసేశారు. అయితే రాకరాక వచ్చిన క్యాచ్ను భారత ఫీల్డర్లు విడిచిపెట్టడం దారుణం. పవర్ప్లేలోనే భారత్ ఓటమి దాదాపు ఖరారైనప్పటికీ.. కనీసం ఒక్క వికెట్ అయినా దక్కకపోదా..? అని చూసిన అభిమానులను నిరాశ తప్పలేదు. ఇంగ్లాండ్ స్పిన్నర్లు రాణించిన పిచ్పై భారత్ స్పిన్నర్లు అక్షర్ పటేల్ (4-0-30-0), అశ్విన్ (2-0-27-0) మాత్రం ప్రభావం చూపలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?