టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

పుణె వేదికగా మరికాసేపట్లో టీమ్‌ఇండియా‌తో తలపడే రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే తొలి వన్డేలో ఓటమిపాలైన ఆ జట్టు ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన...

Updated : 26 Mar 2021 13:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పుణె వేదికగా మరికాసేపట్లో టీమ్‌ఇండియా‌తో తలపడే రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే తొలి వన్డేలో ఓటమిపాలైన ఆ జట్టు ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కోహ్లీసేన ఈ మ్యాచ్‌లోనూ గెలుపొందాలని పట్టుదలగా ఉంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఈరోజే సొంతం చేసుకోవాలని టీమ్ఇండియా భావిస్తోంది. ఇక ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ చేతికి గాయమవడంతో అతడి స్థానంలో జోస్‌బట్లర్‌ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా శ్రేయస్‌కు బదులు రిషభ్‌పంత్‌ను తుది జట్టులోకి తీసుకుంది.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, శార్దూల్‌ ఠాకూర్‌, భువనేశ్వర్‌

ఇంగ్లాండ్‌ జట్టు: జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో, జోస్‌ బట్లర్(కెప్టెన్‌)‌, బెన్‌స్టోక్స్‌, డేవిడ్‌ మలన్‌, లివింగ్‌స్టన్‌, అదిల్‌ రషీద్‌, టామ్‌కరన్‌, సామ్‌ కరన్‌, మోయిన్‌ అలీ, టాప్లీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని