ఆసీస్కు షాకిచ్చి.. ఇంగ్లాండ్ కాలర్ ఎగరేసి
క్రికెట్ పుట్టినిల్లుగా పేరున్న ఇంగ్లాండ్ ఐసీసీ టోర్నీల్లో తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది ఎప్పుడంటే ఎవరైనా 2019 వన్డే ప్రపంచకప్పునే గుర్తుచేసుకుంటారు. కానీ అంతకు తొమ్మిదేళ్ల ముందే ఆ జట్టు పొట్టి క్రికెట్లో విజేతగా నిలిచింది....
కాలింగ్వుడ్ నేతృత్వంలో తొలిసారి విశ్వవిజేత..
క్రికెట్ పుట్టినిల్లుగా పేరున్న ఇంగ్లాండ్ ఐసీసీ టోర్నీల్లో తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది ఎప్పుడంటే ఎవరైనా 2019 వన్డే ప్రపంచకప్పునే గుర్తుచేసుకుంటారు. కానీ అంతకు తొమ్మిదేళ్ల ముందే ఆ జట్టు పొట్టి క్రికెట్లో విజేతగా నిలిచింది. పాల్ కాలింగ్వుడ్ నేతృత్వంలో 2010 టీ20 ప్రపంచకప్లో ఆసీస్ను చిత్తుచేసి తొలిసారి ఐసీసీ కప్పును ముద్దాడింది. అది జరిగి నేటికి 11 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా నాటి విశేషాలు మీకోసం..
అదృష్టం కలిసొచ్చి..
నాటి ప్రపంచకప్ను వెస్టిండీస్లో నిర్వహించారు. ఆ మెగా టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొనగా నాలుగు గ్రూపులుగా విడదీసి లీగ్ మ్యాచ్లు కొనసాగించారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ గ్రూప్ డీలో.. వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లతో పోటీపడింది. అక్కడ ఒక్కో జట్టు మిగిలిన జట్లతో రెండు మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైన ఇంగ్లాండ్ తర్వాత ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో ఫలితం తేలలేదు. అయినా రన్రేట్ పరంగా ఐర్లాండ్ కన్నా మెరుగ్గా ఉండటంతో కాలింగ్వుడ్ టీమ్ సూపర్ 8కు అర్హత సాధించింది.
సూపర్ 8లో సూపర్..
ఇక గ్రూప్ దశ నుంచి సూపర్ 8కు అర్హత సాధించిన ఇంగ్లాండ్ ఇక్కడ పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లను అలవోకగా ఓడించి సెమీస్కు దూసుకెళ్లింది. తొలుత పాక్తో జరిగిన మ్యాచ్లో 148 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో ఛేదించింది. ఇక్కడ కెవిన్ పీటర్సన్(73 నాటౌట్ ; 52 బంతుల్లో 8x4, 2x6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆపై దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్లో 169 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని కివీస్తో మూడో పోటీకి సిద్ధపడింది. ఈ మ్యాచ్లోనూ పీటర్సన్(53; 33 బంతుల్లో 8x4, 1x6) అర్ధశతకంతో రాణించాడు. ఇక న్యూజిలాండ్తో ఆడిన మూడో మ్యాచ్లో ఇంగ్లాండ్ 150 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈసారి ఇయాన్ మోర్గాన్(40; 34 బంతుల్లో 4 x4, 1x6) ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ టీమ్ సెమీస్కు చేరింది.
శ్రీలంకను కూల్చివేసి..
ఆపై సెమీ ఫైనల్లో లంకతో పోరాడిన కాలింగ్వుడ్ టీమ్.. ప్రత్యర్థిని 20 ఓవర్లలో 128/6 స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఇక్కడ ఏంజిలో మాథ్యూస్(58; 45 బంతుల్లో 3x4, 1x6) ఒక్కడే అర్ధశతకంతో ఆదుకోవడంతో శ్రీలంక ఆ మాత్రం స్కోరైనా చేసింది. లేదంటే దాని పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. చివరికి ఇంగ్లాండ్ స్వల్ప లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలో ఛేదించింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ క్రేగ్ కీస్వెటర్(39; 29 బంతుల్లో 5x4, 2x6), మైఖేల్ లంబ్(33; 26 బంతుల్లో 4x4, 1x6), పీటర్సన్(42 నాటౌట్; 26 బంతుల్లో 3x4, 2x6) దంచికొట్టడంతో సునాయాస విజయం సాధించింది. దాంతో ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడింది.
ఆసీస్ను మట్టికరిపించి..
చివరగా ఆస్ట్రేలియాతో తలపడిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా ఆడింది. ఈ పోరుకు ముందు అంతా ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని భావించినా ఇంగ్లాండే విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూలు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 147 పరుగుల స్కోరు సాధించారు. టాప్ ఆర్డర్ చేతులెత్తేయగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ డేవిడ్ హస్సీ(59; 54 బంతుల్లో 2x4, 2x6), కామెరూన్ వైట్(30; 19 బంతుల్లో 4x4, 1x6) ఆదుకున్నారు. ఛేదనలో క్రేగ్ కీస్వెటర్(63; 49 బంతుల్లో 7x4, 2x6), కెవిన్ పీటర్సన్(47; 31 బంతుల్లో 4x4, 1x6) మరోసారి దంచికొట్టడంతో ఇంగ్లాండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. దాంతో కాలింగ్వుడ్ నేతృత్వంలో ఆ జట్టు మూడో పొట్టి ప్రపంచకప్ ముద్దాడింది.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM