sports News: క్వార్టర్స్లో స్పెయిన్ ..రొనాల్డోకు నిరాశే
యూరో 2020 ఫుట్బాల్ టోర్నీలో అగ్ర జట్టు స్పెయిన్ క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం రసవత్తరంగా సాగిన సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో ఆ జట్టు 5-3తో..
సెవిల్లె: యూరో 2020 ఫుట్బాల్ టోర్నీలో అగ్ర జట్టు స్పెయిన్ క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం రసవత్తరంగా సాగిన సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో ఆ జట్టు 5-3తో క్రొయేషియాపై విజయం సాధించింది. నిర్ణీత సమయానికి స్పెయిన్ 3-2తో ఆధిక్యంలో నిలవగా.. ఇంజురీ టైంలో మరియో పసాలిక్ గోల్ (90+2వ నిమిషం) కొట్టి స్కోరు సమం చేశాడు. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి మళ్లింది. స్వల్ప వ్యవధిలో మొరాటా (100వ ని.), ఒయార్జబల్ (103 వ ని.) గోల్స్ కొట్టి స్పెయిన్ను ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. ఆధిపత్యాన్ని కొనసాగించిన స్పెయిన్ మ్యాచ్ను సొంతం చేసుకుంది. అంతకుముందు డిఫెండింగ్ ఛాంపియన్ పోర్చుగల్కు షాక్ తగిలింది. క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని ఆ జట్టు దూకుడుకు.. ప్రపంచ నంబర్వన్ బెల్జియం కళ్లెం వేసి క్వార్టర్స్లో అడుగుపెట్టింది. సోమవారం ప్రి క్వార్టర్స్లో బెల్జియం 1-0 తేడాతో ఆ జట్టును ఓడించింది. మ్యాచ్లో ఎక్కువ భాగం పోర్చుగల్ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ చివరకు ప్రత్యర్థికే విజయం దక్కింది. 42వ నిమిషంలో థోర్గాన్ హజార్డ్ తన జట్టుకు గెలుపు గోల్ అందించాడు. రెండో అర్ధభాగంలో స్కోరు సమం చేసేందుకు పోర్చుగల్ గట్టిగానే ప్రయత్నించింది. కానీ బెల్జియం గోల్కీపర్ గోడలా నిలబడ్డాడు. గోల్ చేసేందుకు పోర్చుగల్ జట్టు 24 ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక్కటీ సఫలం కాలేదు. ఈ యూరో కప్లో అజేయంగా సాగుతున్న బెల్జియం క్వార్టర్స్లో ఇటలీతో తలపడనుంది.
రొనాల్డోకు నిరాశే
సెవిల్లె: అగ్రశ్రేణి ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు ఈ సీజన్ నిరాశజనకంగా సాగుతోంది. 2016లో తన జట్టును యూరో కప్లో విజేతగా నిలిపి.. దేశానికి తొలి ప్రధాన ట్రోఫీని అందించిన అతను.. ఈ సారి ఆ మాయను కొనసాగించలేకపోయాడు. ప్రి క్వార్టర్స్లోనే బెల్జియం చేతిలో పోర్చుగల్ ఓటమితో తీవ్ర నిరాశ చెందిన 36 ఏళ్ల రొనాల్డో బాధతో మైదానం వీడాడు. ఈ సారి యూరో కప్ను అతను గొప్పగానే ఆరంభించాడు. తొలి మూడు మ్యాచ్ల్లోనే అయిదు గోల్స్ చేసి.. ఆల్టైమ్ అంతర్జాతీయ గోల్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఇరాన్ మాజీ ఆటగాడు అలీ దేయ్ను అతను సమం చేశాడు. బెల్జియంతో మ్యాచ్లో అతనొక్క గోల్ చేసినా.. సరికొత్త చరిత్ర సృష్టించడంతో పాటు జట్టునూ కాపాడేవాడు. గత మ్యాచ్ల్లోని తన దూకుడు.. ఈ పోరులో కరవైంది. గోల్ చేసే అవకాశాలనూ సద్వినియోగం చేసుకోలేదు. మెరుపు వేగంతో పరుగెత్తి ప్రత్యర్థులను వెనక్కినెట్టే అతను.. ఆ జోరు ప్రదర్శించలేకపోయాడు. ఫ్రీ కిక్లనూ ఉపయోగించుకోలేకపోయాడు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్గా యూరో కప్లో అడుగుపెట్టిన ఆ జట్టు.. టైటిల్ నిలబెట్టుకోలేకపోయింది. అంతే కాకుండా అత్యధిక అంతర్జాతీయ గోల్స్లో ప్రపంచ రికార్డు సృష్టించేందుకు అతను ఇంకొంత కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. మరోవైపు ఈ ఏడాది ఉత్తమ ఫుట్బాల్ ఆటగాడి అవార్డూ తనకు దక్కేలా లేదు. తన క్లబ్బు జువెంచస్, తన జట్టు పోర్చుగల్ తరపున అతను ఈ సీజన్లో మొత్తం 40కి పైగా గోల్స్ చేసినప్పటికీ.. రొనాల్డో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదనే చెప్పాలి. జువెంచస్కు ఇటాలియన్ లీగ్ (సిరీ- ఎ) టైటిల్ అందించకపోవడంతో వచ్చే ఏడాది ఆ క్లబ్బుతో ముగిసే అతని ఒప్పందాన్ని పొడిగిస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. ఈ ఏడాది అతను.. ఇటాలియన్ కప్, ఇటాలియన్ సూపర్ కప్ టైటిళ్లు మాత్రమే గెలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’