Gautham gambhir: భారత టీ20 లీగ్పై అలాంటి ఆరోపణలు సరికాదు: గౌతమ్ గంభీర్
భారత టీ20 లీగ్ వల్లే భారత ఆటగాళ్లు ఐసీసీ టోర్నమెంట్లలో రాణించలేకపోతున్నారనే వ్యాఖ్యలతో తాను విభేదిస్తానని గౌతమ్ గంభీర్ అన్నాడు.
దిల్లీ: భారత టీ20 లీగ్ వల్లే భారత ఆటగాళ్లు ఐసీసీ టోర్నమెంట్లలో రాణించలేకపోతున్నారనే వ్యాఖ్యలతో తాను విభేదిస్తానని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. భారత క్రికెట్ స్వరూపాన్నే మార్చిన ఈ లీగ్పై ఇటువంటి ఆరోపణలు తనను బాధిస్తున్నాయన్నాడు. ఎఫ్ఐసీసీఐ, ప్రధాన క్రీడల విభాగం ఛైర్పర్సన్ సన్జోగ్ గుప్తా చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న అనంతరం గంభీర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘భారత టీ20 లీగ్ రాకతో మన దేశంలో క్రికెట్కు గొప్ప మేలు జరిగింది. ఈ లీగ్ ప్రారంభమైన సమయం నుంచే దీనిపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఐసీసీ టోర్నమెంట్లలో బాగా ఆడలేకపోతే అందుకు బాధ్యులను చేయాల్సింది ఆటగాళ్లను, వారి ప్రదర్శనను. కానీ టీమ్ఇండియా వైఫల్యం చెందిన ప్రతిసారి అంతా ఈ లీగ్నే తప్పుపడుతుంటారు. అది సరైంది కాదు. ఒక క్రీడాకారుడు 35-36 ఏళ్ల వయసు వరకే సంపాదించగలడు. వారికి ఆర్థిక భరోసా కల్పించడం కూడా అంతే ముఖ్యం. అది టీ20 లీగ్ కారణంగా తీరుతుంది. దీని ద్వారా పొందే ఆదాయం అట్టడుగు స్థాయి నుంచి వారి అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతోంది‘‘ అంటూ వివరించాడు.
అదే సమయంలో భారత టీ20 లీగ్లో స్వదేశీ కోచ్ల అవసరాన్ని వివరిస్తూ.. ‘‘ ప్రస్తుతం టీమ్ఇండియాలో భారత కోచ్లకు సరైన ప్రాధాన్యం ఇస్తూ బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుంది. భారత జట్టుకు కోచ్గా భారతీయుడే ఉండాలని నేను బలంగా కోరుకుంటాను. ఎందుకంటే ఈ ఆట ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నది. దానిని అనుభూతి చెందిన వారే జట్టును సమర్థంగా నడిపించగలరు. లఖ్నవూ జట్టు మెంటార్గా.. ఈ లీగ్లో అన్ని జట్లకు భారతీయ కోచ్లే ఉండటం నేను చూడాలనుకుంటున్నా. మనం విదేశీ కోచ్లకు ఎంతో ప్రాధాన్యం ఇస్తాం. కానీ వారు కేవలం డబ్బులు సంపాదించుకోవడానికే ఇక్కడకు వస్తుంటారు. మన ఆటగాళ్లకు బిగ్ బాష్ వంటి ఇతర విదేశీ లీగ్ల్లో కోచ్ బాధ్యతలు అప్పగించరు. క్రికెట్లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. మనవారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి’’అంటూ తెలిపాడు. బీసీసీఐ తన నిధుల నుంచి 50 శాతాన్ని ఇతర ఒలింపిక్ క్రీడల కోసం వెచ్చించాలని కోరాడు. ఒడిశా అనుసరిస్తున్నట్టుగా ఏదైనా ఒక క్రీడను దేశం తరఫున ముందుకు తీసుకెళ్లాలని ఈ మాజీ క్రికెటర్ సూచించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.