Ricky Ponting: రికీ పాంటింగ్కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్కు కామెంట్రీ ఇస్తూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అస్వస్థతకు గురయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అస్వస్థతకు గురయ్యాడు. మ్యాచ్ కామెంట్రీ చేస్తూ అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రిలో చేరినట్లు ఆస్ట్రేలియా మీడియా సంస్థలు వెల్లడించాయి. పాంటింగ్కు ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు.
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటకు ఛానెల్ 7 తరఫున పాంటింగ్ కామెంటటేర్గా ఉన్నాడు. ఈ మ్యాచ్కు 40 నిమిషాల పాటు వ్యాఖ్యాతగా వ్యవహరించిన 47 ఏళ్ల పాంటింగ్.. లంచ్ విరామం సమయంలో కామెంట్రీ బాక్స్ నుంచి వేగంగా బయటకు వెళ్లారని ఆస్ట్రేలియా మీడియా కథనాలు వెల్లడించాయి. పాంటింగ్ వెంట ఆయన స్నేహితుడు, ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ కూడా ఉన్నారు. ఛాతిలో నొప్పితో అసౌకర్యంగా ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా ఆసుప్రతిలో చేరినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.
1999 నుంచి 2007 వరకు ప్రపంచకప్లో వరుస విజయాలు సాధించిన ఆస్ట్రేలియా జట్టులో పాంటింగ్ భాగస్వామిగా ఉన్నాడు. 2006, 2009లో పాంటింగ్ నేతృత్వంలో ఆసీస్ వరుసగా రెండు సార్లు ఛాంపియన్ ట్రోఫీ సాధించింది. ప్రస్తుతం అతడు భారత టీ20 మెగా లీగ్లో దిల్లీ జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి