SKY: సూర్యకుమార్ లేని మూడు ఫార్మాట్లను ఊహించడం కష్టమే: సురేశ్ రైనా
టీమ్ఇండియా (Team India) సంచలన బ్యాటర్ సూర్యకుమార్ (Surya Kumar Yadav). టీ20ల్లో అదరగొట్టిన సూర్య.. వన్డేల్లో ఫర్వాలేదనిపించాడు. ఇప్పుడు టెస్టుల్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమైపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: గతేడాది టీ20 ఫార్మాట్లో అత్యుత్తమ ఆటగాడిగా సూర్యకుమార్ను ఐసీసీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్లోనే కాకుండా వన్డేల్లో కూడా ఆడుతున్న సూర్యకుమార్.. ఆసీస్తో టెస్టు సిరీస్లోనూ చోటు దక్కించుకొన్నాడు. అయితే, తుది జట్టులోనూ అతడికి స్థానం కల్పించాలని డిమాండ్లూ వచ్చాయి. రిషభ్ పంత్ లేని లోటును తీరుస్తాడని క్రికెట్ పండితులు విశ్లేషించారు. తాజాగా సూర్యకుమార్ ప్రదర్శనపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభినందనలు కురిపించాడు. సూర్యకుమార్ లేకపోతే మూడు ఫార్మాట్లు కూడా ఉండవని వ్యాఖ్యానించాడు.
‘‘సూర్యకుమార్ అద్భుతంగా ఆడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో అతడు బరిలోకి దిగాలి. సూర్య ఆడే విధానం బాగుంది. విభిన్న షాట్లను ఆడాలనే అతడి ప్లానింగ్ సూపర్. ఎటువంటి భయం లేకుండా మైదానం నలువైపులా షాట్లు కొడతాడు. అతడు ముంబయి జట్టులో ఉన్నాడు. కాబట్టి రెడ్ బాల్ క్రికెట్లో ఎలా ఆడాలో అతడికి తెలుసు. ఇప్పుడు టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇదొక అద్భుత అవకాశం. టెస్టు క్రికెట్ ఆడటం వల్ల వన్డేల్లోనూ రాణించేందుకు అవకాశం ఉంది. తప్పకుండా సెంచరీలు, ద్విశతకాలు సాధించగలడు’’ అని సురేశ్ రైనా తెలిపాడు.
రైనా వ్యాఖ్యలతో మరో మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా ఏకీభవించాడు. ‘‘అవును. సూర్యకుమార్ తప్పకుండా టెస్టుల్లో ఆడాలి. అతడి ప్రదర్శన అద్భుతంగా ఉంది. మూడు ఫార్మాట్లలోనూ సూర్య ఆడితే బాగుంటుంది. అయితే, ఇలాంటి చర్చ రావడానికి ప్రధాన కారణం సర్ఫరాజ్ ఖాన్. రంజీల్లో అదరగొట్టాడు. సూర్య టెస్టు జట్టులో ఉండేందుకు వందశాతం అర్హత ఉంది’’ అని ఓజా పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు