KL Rahul - Shikhar : తొలుత సారథిగా ప్రకటించి.. తర్వాత మార్చడం సరైంది కాదేమో!
రేపటి నుంచి జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ను భారత్ ఆడనుంది. తొలుత కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో శిఖర్ ధావన్ను సారథిగా...
టీమ్ఇండియా మాజీ బ్యాటర్ మహమ్మద్ కైఫ్
ఇంటర్నెట్ డెస్క్: రేపటి నుంచి జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ను భారత్ ఆడనుంది. తొలుత కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో శిఖర్ ధావన్ను సారథిగా నియమిస్తూ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. అయితే కరోనా నుంచి కోలుకుని ఫిట్నెస్ సాధించిన కేఎల్ రాహుల్ వచ్చేయడంతో.. అతడికే జట్టు పగ్గాలను అప్పగించింది. అయితే ధావన్ను కాదని రాహుల్కు సారథ్య బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని టీమ్ఇండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. ధావన్కే కెప్టెన్సీని ఉంచేసి సిరీస్ను ఆడిస్తే బాగుండేదని పేర్కొన్నాడు.
‘‘కొవిడ్ నుంచి కోలుకుని వచ్చిన కేఎల్ రాహుల్ తర్వాత ఆసియా కప్లో ఆడతాడు. అంతకుముందు ప్రాక్టీస్ కోసం జింబాబ్వేతో ఎంపిక చేయడం బాగుంది. కానీ చివరి క్షణంలో కెప్టెన్ను మార్చాల్సిన అవసరం లేదనిపించింది. అప్పటికే శిఖర్ ధావన్ను సారథిగా ప్రకటించారు. అతడి నాయకత్వంలో జింబాబ్వేతో ఆడినా.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో అయినా పెద్ద వ్యత్యాసం ఉండదు. సమాచారలోపం వల్ల కలిగిన తప్పిదమని భావిస్తున్నా. ఇలా జరగడంతో ఇతరులకు ప్రశ్నించే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. శిఖర్ ధావన్ ఇలాంటివి పట్టించుకోకపోయినా.. అతడి విషయంలో ఇది సరైన పద్ధతి కాదని మాత్రం చెప్పగలను. ధావన్ అద్భుతమైన ఆటగాడు. ఇంకా చాలా క్రికెట్ ఆడగల సత్తా ఉంది. అయితే ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్లోనే ఆడుతున్నాడు. భారత టీ20 లీగ్లోనూ అదరగొడుతున్న అతడి పేరు జాతీయ జట్టు తరఫున ఎంపిక కాకపోవడం నాకు ఆశ్చర్యం వేసింది’’ అని కైఫ్ వెల్లడించాడు.
ఏ ఫార్మాట్ ప్రత్యేకత దానిదే..
ఇటీవల వన్డే ఫార్మాట్పై తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. వన్డేలను ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలకే పరిమితం చేసి టెస్టు, టీ20 ఫార్మాట్ మ్యాచ్లను ఎక్కువగా ఆడించాలనే వాదన ఉంది. దీనిపై కైఫ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు క్రికెట్లో చాలా రకాల ఫార్మాట్లు ఉన్నాయి. టెస్టులు, వన్డేలు, టీ20, టీ10, హండ్రెడ్.. ఇలా విభిన్న ఫార్మాట్లలో మ్యాచ్లు జరుగుతున్నాయి. అయితే వీటిల్లో దేనికదే ప్రత్యేకం. 50 ఓవర్ల ప్రపంచకప్ ఆసక్తికరంగానే ఉంటోంది. మధ్య ఓవర్లలో ఆట కాస్త నెమ్మదిగా ఉంటుందనే మాట వాస్తవం. ఇప్పుడు ప్రజలంతా త్వరగా ఆట జరిగిపోవాలని కోరుకుంటున్నారు. అందుకే కొందరు బోర్గా ఫీలవుతారు. అయితే ఇలాంటి వారిని నేను నిజమైన క్రికెట్ అభిమానులుగా పరిగణించను. ఏ ఫార్మాట్లోనైనా డాట్ బాల్స్ పడితే తట్టుకోలేకపోతున్నారు. కానీ ఆటగాళ్లు పరిస్థితికి తగ్గట్టుగా ఆడతారని మాత్రం సదరు అభిమానులు మరిచిపోతున్నారు. ఇటీవల ఇంగ్లాండ్ మీద రిషభ్ పంత్ అద్భతమైన శతకం బాదాడు. ఇలాంటి ఇన్నింగ్స్లను చూడాలంటే 50 ఓవర్ల గేమ్ ఉండాల్సిందే. అందుకే ఏ ఫార్మాట్ క్రికెట్ అయినా సొంత టేస్ట్ కలిగి ఉంటుంది’’ అని కైఫ్ వివరించాడు. జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్లో గురవారం తొలి మ్యాచ్ జరగనుంది.
కోహ్లీకే తెలియాలి..
జింబాబ్వేతో వన్డే సిరీస్కు రెగ్యులర్ సారథి రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ వంటి సీనియర్లకు సెలెక్షన్ కమిటీ విశ్రాంతినిచ్చింది. ఇటీవల ఫామ్తో ఇబ్బంది పడుతున్న కోహ్లీని ఈ సిరీస్కు ఎంపిక చేస్తే బాగుండేదని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంపై కైఫ్ స్పందించాడు. ‘‘తన ఫామ్ను అందుకోవడం కేవలం విరాట్ చేతుల్లోనే ఉంది. తన ఫీలింగ్ ఏమిటనేది కోహ్లీనే చెప్పాలి. సెలెక్టర్లు, విరాట్ మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ఎలా ఉందో నాకైతే తెలియదు. ఫామ్లో ఉన్నా లేకున్నా మరిన్ని మ్యాచ్లు ఆడాలి. అయితే విరామం తీసుకోవడం కోహ్లీకి కలిసి వస్తుందని ఆశిద్దాం. తప్పకుండా ఆసియా కప్లో మునుపటి కోహ్లీని చూస్తామని అనుకుంటున్నా’’ అని కైఫ్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో న్యూజిలాండ్ క్రికెట్ ప్రసార హక్కులు ఎస్పీఎన్ఐ సొంతం
న్యూజిలాండ్ పురుషుల (బ్లాక్ క్యాప్స్), మహిళల (వైట్ ఫెర్న్స్) క్రికెట్ జట్ల మ్యాచ్లను వచ్చే ఏడేళ్ల పాటు భారత్, అనుబంధ ప్రాంతాల్లో ప్రసారం చేసేందుకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (ఎస్పీఎన్ఐ) టెలివిజన్, డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు. -
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్