T20 League: ఏడాదికి రెండు టీ20 లీగ్ సీజన్లు.. భారత మాజీ కోచ్ ఏమన్నాడంటే..?
అంతర్జాతీయ స్థాయిలో దేశీయ టీ20 లీగ్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో టీమ్ఇండియా మాజీ కోచ్ రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. రానున్న కాలంలో ఏడాదికి...
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ స్థాయిలో దేశీయ టీ20 లీగ్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో టీమ్ఇండియా మాజీ కోచ్ రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. రానున్న కాలంలో ఏడాదికి రెండు భారత టీ20 లీగ్ల సీజన్లను వీక్షించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. అయితే ఆ రెండు లీగ్లు వేర్వేరుగా ఉంటాయని తెలిపాడు. ఇప్పుడు జరుగుతున్న విధంగానే పూర్తిస్థాయిలో ఒక లీగ్ ఉంటుందని, అలానే ఎక్కువ నాకౌట్ రౌండ్లతో రెండో సీజన్ జరిగే అవకాశం ఉందని వివరించాడు. ఇదంతా ద్వైపాక్షిక సిరీస్లను కుదించడంపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు.
‘‘త్వరలోనే రెండు భారత టీ20 లీగ్లను మీరు చూడబోతున్నారని అనిపిస్తోంది. నాకైతే ఆశ్చర్యమేమీలేదు. అయితే ఇప్పుడున్న ఫార్మాట్ ప్రకారంగానే పూర్తిస్థాయి సీజన్ ఉంటుంది. పది లేదా పన్నెండు జట్లతో దాదాపు రెండున్నర నెలలు మ్యాచ్లు జరుగుతాయి. ఒకవేళ ద్వైపాక్షిక సిరీస్లను తగ్గిస్తే మాత్రం భారత టీ20 లీగ్ రెండో సీజన్ వచ్చే అవకాశం ఉంది. అదీనూ నాకౌట్ రౌండ్లలో టైటిల్ కోసం జట్లు తలపడతాయి. ప్రపంచకప్ ఫార్మాట్ ఎలాగైతే ఉంటుందో ఆ పద్ధతిలో నిర్వహించే ఛాన్స్లు ఉన్నాయి. మనీ, సప్లై, డిమాండ్ సూత్రం ప్రకారం సాధ్యమవుతుందని భావిస్తున్నా. ఎందుకంటే ప్రస్తుతం ఆ స్థాయిలో టీ20 ఫార్మాట్కు డిమాండ్ ఉంది’’ అని రవిశాస్త్రి వివరించాడు. భారత టీ20 లీగ్ వల్ల కేవలం ఆటగాళ్లు, బోర్డులకే కాకుండా అనుబంధంగా ఉన్నవారికి ఎంతో ప్రయోజనంగా మారిందని అభిప్రాయపడ్డాడు. బ్రాడ్కాస్టర్స్, జట్టు సహాయక సిబ్బంది, ఆతిథ్య రంగం.. తదితర విభాగాలు వృద్ధి చెందాయని రవిశాస్త్రి తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
-
సిద్ధమంటూ వచ్చి.. నరకం చూపించి
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం