Virat Kohli : విరాట్ను ఆ స్థానంలో తప్పకుండా చూస్తాం: టీమ్ఇండియా మాజీ ఆటగాడు
టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో బిజీబిజీగా ఉన్న టీమ్ఇండియా అంతకుముందే ఆసియా కప్ను ఆడనుంది. ఆసియా కప్ ముగిసిన..
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో బిజీబిజీగా ఉన్న టీమ్ఇండియా అంతకుముందే ఆసియా కప్ను ఆడనుంది. ఆసియా కప్ ముగిసిన నెల రోజుల వ్యవధిలోనే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. పొట్టి ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక కావాలంటే ఆసియా కప్ ప్రదర్శనే ఆటగాళ్లకు గీటురాయిగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని రోజులుగా టీ20లను ఆడుతున్న యువఆటగాళ్లు తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు. అయితే సీనియర్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో విఫలమైన కోహ్లీకి విండీస్తో సిరీస్కు సెలెక్షన్ కమిటీ విశ్రాంతినిచ్చింది. ఆసియా కప్ కోసం జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. కోహ్లీ ఫామ్ ప్రకారం సెలెక్షన్ కమిటీ ఎంపిక చేస్తుందా.. లేదా అనే అనుమానాలు అతడి అభిమానుల్లో ఉన్నాయి. అయితే కోహ్లీని తప్పకుండా ఆసియా కప్లో చూస్తామని టీమ్ఇండియా మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ మాత్రం నమ్మకంగా చెబుతున్నాడు.
‘‘విరాట్ కోహ్లీ సామర్థ్యంపై ఎలాంటి అనుమానాలు లేవు. ఫామ్ కోల్పోవడం తాత్కాలికం. ఇక అతడు ఏ స్థానంలో ఆడతాడనే దానిపైనా చర్చ కొనసాగుతోంది. అందుకే ఆసియా కప్ చాలా కీలకం. ఇది విరాట్కు మాత్రమే కాకుండా జట్టుకు కూడా ముఖ్యమైన టోర్నమెంట్. ఇక్కడే బ్యాటింగ్ లైనప్ను సరి చూసుకునే అవకాశం ఉంటుంది. టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే ముందు ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్కు రావాలనే దానిపై అవగాహన కోసం ఆసియా కప్ను వేదికగా చేసుకోవాలి. కేఎల్ రాహుల్ ఫిట్నెస్పై సందిగ్ధత నేపథ్యంలో రోహిత్ శర్మతో విరాట్ కోహ్లీని ఓపెనర్గా చూడొచ్చు. ఆసియా కప్నకు అందుబాటులో ఉంటానని ఇప్పటికే విరాట్ చెప్పాడు. అయితే రోహిత్-కోహ్లీ జోడీనే కాకుండా ఇంకా కొత్త ఓపెనింగ్ బ్యాటర్లను చెక్ చేసే అవకాశం లేకపోలేదు. భారత టీ20 లీగ్లో విరాట్ కోహ్లీ బెంగళూరు తరఫున చాలా మ్యాచుల్లో ఓపెనింగ్ చేశాడు’’ అని పార్థివ్ వివరించాడు. ఆగస్ట్ 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?