Prithvi Shaw: రంజీ ట్రోఫీలో అదిరిపోయే రికార్డు.. పృథ్వీకి అవకాశం ఇవ్వాలి: మాజీ పేసర్
దాదాపు రెండేళ్ల కిందట భారత్ (team india) తరఫున మ్యాచ్ ఆడిన యువ బ్యాటర్ పృథ్వీషా (Prithvi Shaw).. తాజాగా రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో అతడిని జాతీయ జట్టులోకి తీసుకోవాలనే సూచనలు వచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: రంజీ ట్రోఫీలో యువ బ్యాటర్ పృథ్వీ షా రికార్డు సృష్టించాడు. అసోం జట్టుపై 379 పరుగులు (383 బంతుల్లో) చేసి.. రంజీ ట్రోఫీ చరిత్రలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్గా అవతరించాడు. ముంబయి తరఫున ఆడుతున్న పృథ్వీని మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. చివరిసారిగా 2021లో భారత్ తరఫున టీ20 మ్యాచ్ ఆడిన పృథ్వీ ఆ తర్వాత జట్టులోకి రాలేకపోయాడు. దీంతో అతడి ప్రదర్శనను మేనేజ్మెంట్ పరిగణనలోకి తీసుకొని అవకాశాలు కల్పించాలని టీమ్ఇండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ సూచించాడు.
‘‘పృథ్వీ షా అద్భుతమైన ఆటగాడు. ఇలాంటి టాలెంటెడ్ ప్లేయర్ను అరుదుగా చూస్తుంటాం. గతంలో జట్టు నుంచి ఏ కారణాలతో తప్పించారనేది అనవసరం. అయితే ఇప్పుడు ఇలాంటి ప్రదర్శన చేయడం వల్ల టీమ్ మేనేజ్మెంట్ కూడా పృథ్వీ షాకు అవకాశాలు ఇచ్చే విషయాన్ని ఆలోచించాలి. అతడితో మాట్లాడుతూ.. పర్యవేక్షిస్తూ ఉండాల్సిన బాధ్యత మేనేజ్మెంట్పై ఉంది. ఇలా చేయడం వల్ల పృథ్వీతోపాటు టీమ్ఇండియాకు చాలా మేలు జరుగుతుంది’’ అని వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్ చేశాడు.
పృథ్వీ ఆవేదన ఇదీ..
టాలెంట్ ఉన్నప్పటికీ ఇతర ఆటగాళ్లతో పోలిస్తే పృథ్వీకి అవకాశాలు చాలా తక్కువగానే వచ్చాయి. ఐపీఎల్లో అదరగొట్టేసే పృథ్వీని జాతీయ జట్టు ఎంపికలో మాత్రం పెద్దగా పట్టించుకొన్న దాఖలాలు లేవు. దీంతో ఒకానొక సందర్భంలో పృథ్వీ షా తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ‘‘కొన్నిసార్లు చాలా నిరుత్సాహానికి గురవుతుంటా. ఎందుకంటే మనవంతుగా సరైన పద్ధతిలోనే వెళ్తున్నప్పటికీ.. మంచి ఆటతీరు కనబరిచినా.. మైదానంలోనూ, వెలుపల క్రమశిక్షణతో వ్యవహరించినా అవకాశాలు రాకపోవడంపై అభిమానులు పలురకాలుగా మాట్లాడుతుంటారు. మీ గురించి తెలియనివారు కూడా జడ్జ్ చేస్తుంటారు’’ అని పృథ్వీ షా తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.