WPL 2023: డబ్ల్యూపీఎల్.. అందరూ భారత కెప్టెన్లే ఉంటే బాగుండేది: అంజుమ్ చోప్రా
మహిళా ప్రీమియర్ లీగ్ (WPL 2023) ఐదు జట్లలో మూడు టీమ్లకు విదేశీ కెప్టెన్లు ఉండటం సరైంది కాదని టీమ్ఇండియా (Team India) మహిళా జట్టు మాజీ సారథి అంజుమ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళా క్రికెటర్ల నిరీక్షణకు తెరపడింది. తొలి మహిళా ప్రీమియర్ లీగ్ (WPL 2023)లో ముంబయి ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్తో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐదు జట్లకు సారథులను ఆయా ఫ్రాంచైజీలు ప్రకటించాయి. ఈ క్రమంలో భారత మహిళా జట్టు కెప్టెన్ అంజుమ్ చోప్రా మాత్రం ఓ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అత్యుత్తమ భారత క్రికెటర్లకు అన్ని ఫ్రాంచైజీల సారథ్య బాధ్యతలు అప్పగిస్తే బాగుండేదని పేర్కొంది. రెండు జట్లకు మాత్రమే భారత స్టార్ ప్లేయర్లు కెప్టెన్గా ఉండగా.. మరో మూడు ఫ్రాంచైజీలు విదేశీ క్రికెటర్లను నియమించుకున్నాయి.
‘‘తొలి మహిళా ప్రీమియర్ లీగ్లో నాకొక విషయం నచ్చలేదు. ఎక్కువ ఫ్రాంచైజీలు విదేశీ క్రికెటర్లనే తమ జట్లకు కెప్టెన్గా నియమించుకున్నాయి. ఇది భారత క్రికెట్ లీగ్ (WPL 2023). స్వదేశంలోని పరిస్థితులు ఇక్కడి వారికి బాగా అర్థం అవుతాయి. కాబట్టి, కెప్టెన్సీ చేయగల సామర్థ్యం కలిగిన టీమ్ఇండియా ప్లేయర్లకే జట్టు పగ్గాలను అప్పగిస్తే బాగుండేది. దీప్తి శర్మ కూడా సారథిగా జట్టును నడిపించగలదు. ఇప్పటికే ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ టోర్నీలో నాయకత్వ బాధ్యతలు చేపట్టింది. అయితే, భారత ప్లేయర్లతో పోలిస్తే ఆసీస్ క్రికెటర్లకు అనుభవం ఎక్కువే. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ, స్వదేశంలో భారత అమ్మాయిలకే జట్టు పగ్గాలు అప్పగిస్తే బాగుంటుంది. అనుభవపరంగా అయితే ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్ సారథిగా ఉన్న మెగ్ లానింగ్ను కాదని జెమీమా రోడ్రిగ్స్కు కెప్టెన్సీ ఇవ్వలేరు. సహజంగా చూసుకుంటే.. ఆసీస్ ప్లేయర్లతో పోలిస్తే భారత క్రికెటర్లకు కెప్టెన్సీ సామర్థ్యం తక్కువే’’ అంజుమ్ చోప్రా తెలిపింది.
‘‘క్రికెట్ ప్రొఫెషనల్ గేమ్. కొంత ధరకు ఆయా ఫ్రాంచైజీతో కాంట్రాక్ట్ అయి ఉంటారు. ప్రతిదీ కొత్తగా అనిపిస్తుంది. అయితే, పరిస్థితులను త్వరగా అలవర్చుకొని ఇతర ప్లేయర్ల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగాలి. దేశీయ క్రికెటర్లు ఇందులో కీలక పాత్ర పోషిస్తారని నేను భావిస్తున్నా. అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం రావడం నిజంగా అద్భుతం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు భారత క్రికెట్కు ఎన్నో సవాళ్లు విసిరాయి. ఇప్పుడు ఈ టోర్నీ తప్పకుండా టీమ్ఇండియా (Team India) క్రికెట్కు సాయపడుతుంది’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు. -
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) బర్త్ డే సందర్భంగా పెద్దఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్