Rishabh Pant: ‘పంత్‌ లాంటి కెప్టెన్‌ ఉంటే టీమ్‌ఇండియాకు మంచిది’

రిషభ్‌పంత్‌ లాంటి కెప్టెన్‌ ఉంటే టీమ్‌ఇండియాకు మంచిదని మాజీ క్రికెటర్‌ అరుణ్‌ లాల్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో అతడు సెంచరీ కొట్టి మరీ క్లిష్ట పరిస్థితు...

Published : 20 Jul 2022 01:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రిషభ్‌పంత్‌ లాంటి కెప్టెన్‌ ఉంటే టీమ్‌ఇండియాకు మంచిదని మాజీ క్రికెటర్‌ అరుణ్‌ లాల్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో అతడు సెంచరీ కొట్టి మరీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జట్టును గెలిపించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడిన అరుణ్‌లాల్‌.. రోహిత్‌ తర్వాత పంత్‌ కెప్టెన్‌గా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. కెప్టెన్‌ అనేవాడు ఎప్పుడూ టాప్‌-3లో ఉండాలన్నాడు. పంత్‌ తన సహజసిద్ధమైన ఆట ఆడేందుకు భయపడడని, ఒత్తిడిని కూడా తట్టుకోగలడని పేర్కొన్నాడు.

‘పంత్‌ కష్టాల్లో ఉన్న జట్టును గెలిపిస్తాడు. అలాంటి ఆటగాడు గొప్ప సారథిగా రాణిస్తాడనే నమ్మకం ఉంది. అతడిలాంటి దూకుడైన ఆటగాడు కెప్టెన్‌గా ఉంటే టీమ్‌ఇండియాకు మంచిది. ఒకప్పుడు టెస్టుల్లో గెలవడం అంటే డ్రా చేసుకున్నా సరిపోయేదనే అభిప్రాయం ఉండేది. కానీ, ఇప్పుడు అది మారిపోయింది. ఆ క్రెడిట్‌ అంతా కోహ్లీకే దక్కుతుంది. అతడు టీమ్‌ఇండియా ఆటగాళ్ల ఆలోచనా దృక్పథాన్ని మార్చేశాడు. ఆటగాళ్లలో ఎలాగైనా గెలవాలనే పట్టుదల తీసుకొచ్చాడు. ఓడిపోతామనే భయంలేకుండా ఆటగాళ్లను తీర్చిదిద్దాడు. పంత్‌ కూడా అదే దూకుడును కొనసాగించినా ఇంతకుమించి చేయలేడు. పంత్‌ ఇలాగే నిలకడగా రాణిస్తే టీమ్‌ఇండియాలో హీరోగా మారుతాడు’ అని అరుణ్‌లాల్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని