Rishabh Pant: ‘పంత్ లాంటి కెప్టెన్ ఉంటే టీమ్ఇండియాకు మంచిది’
రిషభ్పంత్ లాంటి కెప్టెన్ ఉంటే టీమ్ఇండియాకు మంచిదని మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో అతడు సెంచరీ కొట్టి మరీ క్లిష్ట పరిస్థితు...
ఇంటర్నెట్డెస్క్: రిషభ్పంత్ లాంటి కెప్టెన్ ఉంటే టీమ్ఇండియాకు మంచిదని మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో అతడు సెంచరీ కొట్టి మరీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జట్టును గెలిపించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఓ టీవీ ఛానల్తో మాట్లాడిన అరుణ్లాల్.. రోహిత్ తర్వాత పంత్ కెప్టెన్గా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. కెప్టెన్ అనేవాడు ఎప్పుడూ టాప్-3లో ఉండాలన్నాడు. పంత్ తన సహజసిద్ధమైన ఆట ఆడేందుకు భయపడడని, ఒత్తిడిని కూడా తట్టుకోగలడని పేర్కొన్నాడు.
‘పంత్ కష్టాల్లో ఉన్న జట్టును గెలిపిస్తాడు. అలాంటి ఆటగాడు గొప్ప సారథిగా రాణిస్తాడనే నమ్మకం ఉంది. అతడిలాంటి దూకుడైన ఆటగాడు కెప్టెన్గా ఉంటే టీమ్ఇండియాకు మంచిది. ఒకప్పుడు టెస్టుల్లో గెలవడం అంటే డ్రా చేసుకున్నా సరిపోయేదనే అభిప్రాయం ఉండేది. కానీ, ఇప్పుడు అది మారిపోయింది. ఆ క్రెడిట్ అంతా కోహ్లీకే దక్కుతుంది. అతడు టీమ్ఇండియా ఆటగాళ్ల ఆలోచనా దృక్పథాన్ని మార్చేశాడు. ఆటగాళ్లలో ఎలాగైనా గెలవాలనే పట్టుదల తీసుకొచ్చాడు. ఓడిపోతామనే భయంలేకుండా ఆటగాళ్లను తీర్చిదిద్దాడు. పంత్ కూడా అదే దూకుడును కొనసాగించినా ఇంతకుమించి చేయలేడు. పంత్ ఇలాగే నిలకడగా రాణిస్తే టీమ్ఇండియాలో హీరోగా మారుతాడు’ అని అరుణ్లాల్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.