IND vs ENG: 18నెలల కిందట చూసిన బౌలర్లా లేడు.. టీమ్ ఇండియాకు పెద్ద షాక్: మాజీ క్రికెటర్లు
భారత్ నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించి ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది. ఈ క్రమంలో టీమ్ఇండియా ఆటగాళ్ల ప్రదర్శనపై...
ఇంటర్నెట్ డెస్క్: భారత్ నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించి ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది. ఈ క్రమంలో టీమ్ఇండియా ఆటగాళ్ల ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జో రూట్ - బెయిర్స్టో భాగస్వామ్యాన్ని విడదీయడంలో బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. టీమ్ఇండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్, మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్, మాజీ వికెట్ కీపర్ దీప్దాస్ గుప్తా తమ అభిప్రాయాలను వెల్లడించారు.
అప్పుడు చూసిన బౌలర్లా లేడు.. : మంజ్రేకర్
టీమ్ఇండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ నాలుగో ఇన్నింగ్స్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మరీ ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ 113 పరుగులు ఇచ్చి కేవలం ఒకే వికెట్ పడగొట్టాడు. 18 నెలల కిందట చూసిన శార్దూల్ ఠాకూర్.. ఇప్పటి శార్దూల్కు చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు టెస్టు క్రికెట్లో కీలక సమయంలో వికెట్లు తీస్తూ ఉండేవాడు. కానీ ఈ టెస్టులో పూర్తిగా విఫలమయ్యాడు. అదేవిధంగా సిరాజ్ బౌలింగ్ను గమనిస్తే.. లెంగ్త్ లేదనిపిస్తోంది.
టీమ్ఇండియాకు పెద్ద షాక్: అజిత్ అగార్కర్
ఇంగ్లాండ్ 378 పరుగులను ఛేదించడం.. భారత్కు పెద్ద షాక్. కేవలం 76.4 ఓవర్లలోనే మూడు వికెట్లను మాత్రమే నష్టపోయి చేయడమంటే భారత బౌలర్ల ఘోర వైఫల్యానికి నిదర్శనం. కేవలం ఇద్దరే బ్యాటర్లు ఎంతో నమ్మకంగా బ్యాటింగ్ చేశారు. ఓపెనర్లతోపాటు వెంటనే ఇంకో వికెట్ పడినా ఎక్కడా వెనుకడుగు వేయలేదు. భారత జట్టులో లోపించిన అంశం కూడా కాన్ఫిడెన్స్. ఇంగ్లాండ్ చాలా కృషి చేసింది. అందుకే సులువుగా ఛేదించేసింది.
స్థిరమైన సారథ్యం ఉండాలి: దీప్దాస్ గుప్తా
ఈ ఓటమి భారత్కు స్థిరమైన కెప్టెన్ అవసరాన్ని నొక్కి చెప్పింది. గాయాలపాలు కావడం లేదా ఇతర కారణాలతో సారథులను మార్చాల్సి వస్తోంది. అది కూడానూ భారత్ ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపింది. రోహిత్ శర్మ ఫిట్గా ఉన్నాడు కాబట్టి ఇక ఆ సమస్య ఉండబోదు. రాబోయే మ్యాచ్లకు పూర్తిగా అందుబాటులో ఉంటాడు. ఇక వచ్చే టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. ప్రపంచకప్లోపు కనీసం 20-22 మ్యాచ్లను టీమ్ఇండియా ఆడొచ్చు. కాబట్టి ప్రతి మ్యాచ్ ముఖ్యమైందే. సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకు ఇది చాలా కీలకం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.