Asia Cup 2023: ఆసియా కప్ వేదికపై తొలగని సందిగ్ధత.. పాక్ మాజీ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు
దాయాదుల మధ్య పోరు(IND vs PAK) కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుందని తెలుసు కదా.. కానీ, ఇరు జట్లూ ఒకరి దేశంలో మరొకటి ఆడవు. అయితే, ఈ ఏడాది రెండు మెగా ఈవెంట్లు జరగనుండటంతో.. అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ 2023 వేదికపై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్ అతిథ్య దేశం కాగా.. బీసీసీఐ (BCCI) మాత్రం అక్కడికి టీమ్ఇండియాను (Team India) పంపేదిలేదని తెగేసి చెప్పేసింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)లో ఇప్పటికే చర్చలు జరగగా.. మార్చిలో మరోసారి భేటీ అయి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే, భారత్ ఆడే మ్యాచ్లను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు పాక్ సిద్ధమనే వార్తలు వచ్చాయి. పాకిస్థానే టోర్నీని నిర్వహిస్తూ.. టీమ్ఇండియా మ్యాచ్లను మాత్రం యూఏఈలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సంసిద్ధత వ్యక్తం చేసినట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఇదే అంశంపై పాక్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ ఆటగాళ్లకు భారతీయ అభిమానుల నుంచి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోందన్నాడు. అలాగే, టీమ్ఇండియా ఆసియా కప్ కోసం తమ దగ్గరకు రాకపోతే.. వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) కోసం భారత్కు వెళ్లకూడదని చెప్పాడు.
‘‘పాక్లో జరిగే ఆసియా కప్ను ఆడేందుకు భారత్ అంగీకరించకపోతే.. 2023 వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టు అక్కడికి వెళ్లకూడదు. అయితే, ఇవేమీ మన చేతుల్లో ఉండవు. ఐసీసీ నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే పీసీబీ అయినా దానిపై దృష్టిపెట్టాలి. మేం ప్రపంచ ఛాంపియన్లం. టీ20 ప్రపంచకప్తోపాటు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. ఐసీసీ ర్యాంకింగ్స్లో అన్ని ఫార్మాట్లలోనూ అగ్ర స్థానంలో నిలిచాం. అయితే, ఐసీసీ, పీసీబీ, బీసీసీఐ చేతుల్లో ఏమీ లేదు. రెండు ప్రభుత్వాల స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఇరు జట్లూ పర్యటించవు. మరి ఇదెంత కాలం ఉంటుందో చూడాలి’’ అని కమ్రాన్ అక్మల్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.