KL or KS: కేఎల్ రాహుల్ X కేఎస్ భరత్.. నా మద్దతు అతడికే: సబా కరీం
జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్తోనే భారత్ తలపడనుంది. అయితే తుది జట్టులో ఎవరు ఉండాలనేదానిపై తీవ్ర చర్చ సాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిష్ ఫైనల్కు (WTC Final) దాదాపు మూడు నెలల సమయం ఉంది. కానీ, ఇప్పటి నుంచే తుది జట్టులో ఎవరు ఉండాలి...? ఏ ప్లేయర్ ఆడితే బాగుంటుంది..? వంటి అంశాలపై మాజీలు తెగ చర్చించేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో రిషభ్ పంత్ వికెట్ కీపర్గా అందుబాటులో లేడు. దీంతో కీపింగ్ బాధ్యతలను చేపట్టే ఆటగాడిపైనే ఇప్పుడంతా చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. వారిలో కేఎస్ భరత్ ఒకరు కాగా.. మరొకరు కేఎల్ రాహుల్ కావడం విశేషం. ఇప్పటికే దినేశ్ కార్తిక్, సునీల్ గావస్కర్ తమ అభిప్రాయాలను వెల్లడించగా.. తాజాగా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ సెలెక్టర్ సబా కరీం కూడా స్పందించారు.
‘‘తుది జట్టు ఎంపిక అనేది మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయం. కానీ, వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. ఇటీవల కాలంలో జట్టు యాజమాన్యం ఎక్కువగా యువకులకు అవకాశం కల్పిస్తోంది. వారిలో భద్రతాభావం పెరిగేలా చేస్తోంది. అందుకోసం అత్యుత్తమ వాతావరణం తయారు చేసింది. ఆటగాళ్ల ప్రదర్శన పట్ల కఠినంగా ఉండటం లేదు. టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన యంగ్ క్రికెటర్లపై నమ్మకం ఉంచింది. కేఎల్ రాహుల్ను కేవలం బ్యాటర్గానే జట్టులోకి తీసుకోవచ్చు. అంతేకానీ, రిషభ్ పంత్ లేడని అతడి స్థానంలో రాహుల్కు అవకాశం ఇవ్వడం సరైంది కాదు. యువ క్రికెటర్కు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది’’ అని కరీం తెలిపాడు.
‘‘కేఎస్ భరత్కు భారత మేనేజ్మెంట్ మరిన్ని అవకాశాలు ఇస్తుందని భావిస్తున్నా. ఇంగ్లాండ్లో పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. అలాంటి పిచ్పై ఆడటం యువ క్రికెటర్కు సవాల్తో కూడుకున్నదే. అయితే, ఇప్పటి వరకు కొన్ని టెస్టు మ్యాచుల్లో వికెట్ల వెనుక భరత్ అద్భుతంగా చేశాడు. అయితే, మరిన్ని అంశాల్లో మెరుగు కావాల్సి ఉంది. అందుకే, అతడిని సన్నద్ధం చేయడానికి అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి భారత్ A తరఫున చాలా సవాళ్లను ఎదుర్కొని ఉంటాడు. అలాంటప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ తన స్థానంపై నమ్మకం కలిగేలా ఛాన్స్ ఇస్తే ఉత్తమం’’ అని సబా కరీం చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?