Sushil Kumar: సుశీల్ ఎలా దాడి చేశాడంటే..!
యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసలు సుశీల్ కుమార్ ఏం చేశాడు? ఎందుకు చేశాడు? ఎవరెవరిని బంధించాడు? వంటి వివరాలపై స్పష్టత లభిస్తోంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి, సాగర్ మిత్రుడు సోనూ మహల్ మే 5న సుశీల్ ఏం చేశాడో మీడియాకు..
మే 5న ఏం జరిగిందో వివరించిన ప్రత్యక్ష సాక్షి
దిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసలు సుశీల్ కుమార్ ఏం చేశాడు? ఎందుకు చేశాడు? ఎవరెవరిని బంధించాడు? వంటి వివరాలపై స్పష్టత లభిస్తోంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి, సాగర్ మిత్రుడు సోనూ మహల్ మే 5న సుశీల్ ఏం చేశాడో మీడియాకు వివరించాడు.
మే 5న సుశీల్ తనను తీవ్రంగా కొట్టాడని సోనూ చెప్పాడు. ఛత్రసాల్ స్టేడియం కోచ్ వీరేంద్రను సైతం బయటకు తీసుకెళ్లి కొట్టినట్టు వివరించాడు. ఎందుకంటే ఆయన నంగోలిలో సొంతంగా కోచింగ్ కేంద్రం తెరిచారని పేర్కొన్నాడు. ఛత్రసాల్ నుంచి 50-60 మంది రెజ్లర్లను సాగర్ రాణా అక్కడికి తీసుకెళ్లడం మొదలు పెట్టడంతో సుశీల్లో కోపం కట్టలు తెంచుకొందన్నాడు. మే 4, 5 రాత్రుల్లో మునుపెన్నడూ లేనంత ఆగ్రహంతో కనిపించాడని తెలిపాడు. తను, సాగర్ సహా మొత్తం ఐదుగురిని అతడు బయటకు తీసుకెళ్లి బంధించాడని స్పష్టం చేశాడు. బంధీల్లో ఒకరి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని వదిలేశాడని వెల్లడించాడు.
‘మే 4 ఉదయం నుంచి సాగర్ రాణా కోసం సుశీల్ తీవ్రంగా గాలించాడు. నీరజ్ భావ్నాతో కలిసి ఔటర్ దిల్లీ ప్రాంతంలో అమిత్, రవీంద్రను బంధించాడు. కారులోనే వారిద్దరినీ బాగా కొట్టారు. భయంతో వారు నాతో పాటు సాగర్ ఇంటి చిరునామాలు చెప్పేశారు. సుశీల్ అతడి అనుచరులతో కలిసి రాణాను బంధించి కారులో చితకబాదాడు. విడిచిపెట్టిన తర్వాత మేం ఆస్పత్రిలో చేరాం. భగత్ సింగ్ అనే రెజ్లర్నూ సుశీల్ బంధించి రాత్రంతా కొట్టాడు. దాంతో అతడి భార్య మే 5 రాత్రి తన భర్తను అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది’ అని సోనూ వివరించాడు.
‘ఈ విషయం తెలిసి సుశీల్.. భగత్తో తన భార్యకు వీడియో కాల్ చేయించాడు. బాగానే ఉన్నానని, కిడ్నాప్ అవ్వలేదని చెప్పించాడు. కానీ అనుమానం వచ్చిన అతడి సతీమణి మళ్లీ పోలీసులకు ఫోన్ చేసింది. దాంతో సుశీల్ అతడిని విడుదల చేశాడు’ అని సోనూ తెలిపాడు. ఈ దాడిలో సోనూ చేతులు విరిగిపోవడంతో శస్త్రచికిత్స చేయించుకొని కడ్డీ వేయించుకున్నాడు. సాగర్ రాణా మరణించాడు. ఆ తర్వాత సుశీల్ పరారవ్వడం, పది రోజులకు దొరకడం.. కోర్టు రిమాండ్ విధించిండం తెలిసిన సంగతే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.