రెండో టెస్టుకు ఫ్యాన్స్.. నిబంధనలు తెలుసా?
భారత్, ఇంగ్లాండ్ తలపడే రెండో టెస్టును వీక్షించేందుకు స్టేడియానికి వచ్చే అభిమానులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని నిర్వాహకులు తెలిపారు. కొవిడ్-19 లక్షణాలు ఉన్నవారిని స్టేడియంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. వీక్షకులు పాటించాల్సిన నిబంధనలను వెల్లడించారు....
చెన్నై: భారత్, ఇంగ్లాండ్ తలపడే రెండో టెస్టును వీక్షించేందుకు స్టేడియానికి వచ్చే అభిమానులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని నిర్వాహకులు తెలిపారు. కొవిడ్-19 లక్షణాలు ఉన్నవారిని స్టేడియంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. వీక్షకులు పాటించాల్సిన నిబంధనలను వెల్లడించారు.
కొవిడ్-19 వల్ల గతేడాది నుంచి భారత్లో క్రికెట్ జరగలేదు. ఇంగ్లాండ్ సిరీసుతోనే క్రికెట్ ఆరంభమైంది. ఆంక్షలు ఉండటంతో చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టుకు అభిమానులను అనుమతించలేదు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సవరించడంతో రెండో టెస్టు నుంచి వీక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. దాదాపు 15వేల మందికి మ్యాచును వీక్షించే అవకాశం ఉంది.
‘రెండో టెస్టును వీక్షించేందుకు స్టేడియానికి వచ్చే అభిమానులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి. జ్వరం, దగ్గు, జలుబు వంటి కొవిడ్ లక్షణాలుంటే లోనికి అనుమతించరు’ అని తమిళనాడు క్రికెట్ సంఘం తెలిపింది. వీక్షకులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేయకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జాతి వివక్ష, మత వివక్ష, అశ్లీల పదజాలం ఉపయోగించకూడదని పేర్కొంది. క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది.
స్టేడియంలోకి బైనాక్యులర్లు, స్పీకర్లు, సంగీత పరికరాలు వంటివి తీసుకురావద్దని నిర్వాహకులు తెలిపారు. ‘సంచులు, బ్రీఫ్కేసులు, రేడియోలు, లేజర్ పాయింటర్లు, డిజిటల్ డైరీలు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, టేప్ రికార్డర్లు, రికార్డింగ్ పరికరాలు, బైనాక్యులర్లు, రిమోట్ నియంత్రిత వస్తువులు, మందుగుండు సామగ్రి, సంగీత పరికరాలు, స్పీకర్లు, ప్రొఫెషనల్/వీడియో కెమేరాలు తీసుకురావడం నిషేధం’ అని పేర్కొన్నారు. 2012 నుంచి మూసేసిన ఐ, జే, కే స్టాండ్లను తెరుస్తున్నామని వెల్లడించారు.
ఇవీ చదవండి
పంత్కే ఐసీసీ తొలి పురస్కారం
లోకల్ బాయ్స్ ఆల్రౌండ్ షో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.