Duplessis: కెప్టెన్గా.. వారిలా మాత్రం ఉండలేను: డుప్లెసిస్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఈసారి ఎలాగైనా తన జట్టును ప్లేఆఫ్స్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనతోనూ అదరగొట్టేస్తున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్లేఆఫ్స్ రేసులో ఉంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగా.. అందులోనూ విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒక్క మ్యాచ్ ఓడినా సరే ఆశలు గల్లంతే. గురువారం హైదరాబాద్తో, మే 21న గుజరాత్తో బెంగళూరు తలపడనుంది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ బ్యాటింగ్తో అదరగొడుతూ జట్టును నడిపిస్తున్నాడు. హైదరాబాద్తో మ్యాచ్కు సన్నద్ధమవుతున్న డుప్లెసిస్ ఓ ఛానల్తో మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ మాదిరి సారథిగా ఉండలేనని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్లో ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్తోపాటు రైజింగ్ పుణె సూపర్జెయింట్కు ఆడిన డుప్లెసిస్ గతేడాది నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతోన్న విషయం తెలిసిందే. అయినా ధోనీ కెప్టెన్సీని మాత్రం అభినందించకుండా ఉండడు.
‘‘ఇద్దరు అద్భుతమైన క్రికెటర్లు, కెప్టెన్ల వద్ద ఆడటం బాగుంది. వారి నుంచి ఎంతో నేర్చుకోగలిగా. నేను జాతీయ జట్టులోకి వచ్చినప్పుడు దక్షిణాఫ్రికా కెప్టెన్గా గ్రేమీ స్మిత్ సారథిగా ఉండేవాడు. ఐపీఎల్లో చెన్నై జట్టు తరఫున తొలి సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినా, అక్కడ నుంచి చాలా అంశాలను నేర్చుకున్నా. స్టీఫెన్ ఫ్లెమింగ్ దగ్గరే కూర్చొని ప్రతి విషయం గురించి అడిగేవాడిని. ఎక్కువగా నాయకత్వంపైనే మాట్లాడేవాడిని. ధోనీని దూరం నుంచే పరిశీలించేవాడిని. చాలా సంవత్సరాలుగా ఎందుకు అతడు విజయవంతమయ్యాడని ఆలోచించా. కానీ, ఎప్పుడూ కూడా ఎంఎస్ ధోనీ, గ్రేమీ స్మిత్, స్టీఫెన్ ఫ్లెమింగ్, విరాట్ కోహ్లీలా మారాలని ప్రయత్నించలేదు. నాదైన శైలిలోనే జట్టును నడిపించడం నేర్చుకున్నా.
అయితే, ఎంఎస్ ధోనీ నుంచి నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకున్నానని చెప్పగలను. నా ఆటగాళ్లకు సంబంధించి నేను చాలా స్పష్టతతో ఉంటానని నాకు తెలుసు. మీ పూర్తిస్థాయి ప్రదర్శనను ఇవ్వండి చాలు అని వారికి చెబుతుంటా. ఇలా చేయడం వల్లే ధోనీని ‘కెప్టెన్ కూల్’గా అభిమానులు పిలుచుకుంటారు. ధోనీని మించిన మరొక సారథి ఉండడు’’ అని డుప్లెసిస్ ప్రశంసించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే