Faf duplessis: ఫైనల్లో ఆడేందుకు మాకన్నా రాజస్థాన్కే ఎక్కువ అర్హత: డుప్లెసిస్
భారత టీ20 లీగ్ ఫైనల్లో ఉండేందుకు తమకన్నా రాజస్థాన్కే ఎక్కువ అర్హత ఉందని బెంగళూరు కెప్టెన్ ఫా డుప్లెసిస్ అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: భారత టీ20 లీగ్ ఫైనల్లో ఆడేందుకు తమకన్నా రాజస్థాన్కే ఎక్కువ అర్హత ఉందని బెంగళూరు కెప్టెన్ ఫా డుప్లెసిస్ అన్నాడు. గతరాత్రి జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో బెంగళూరుపై రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా మూడో ఏడాది కూడా బెంగళూరు ప్లేఆఫ్స్ చేరినా ఫైనల్కు వెళ్లలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడిన బెంగళూరు కెప్టెన్.. ఈ ఓటమి నిరాశ కలిగించినా తమ ఆటగాళ్లు ఈ సీజన్లో బాగా ఆడారని మెచ్చుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తాము 180 పరుగులు చేసుంటే బాగుండేదని పేర్కొన్నాడు.
‘ఇది బెంగళూరుకు చాలా గొప్ప సీజన్. మా ఆటపట్ల గర్వంగా ఉంది. మేం ఎక్కడికివెళ్లినా అభిమానుల మద్దతు కూడా బాగుంది. మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సీజన్లో మా ఆటగాళ్లు హర్షల్ పటేల్, దినేశ్ కార్తీక్, రజత్ పటీదార్ వంటి వారు అద్భుత ప్రదర్శన చేశారు. కొందరు టీమ్ఇండియాకు ఎంపికయ్యారు. వీరితో పాటు మరికొంతమంది నాణ్యమైన యువ ఆటగాళ్లు ఉన్నారు. దీంతో మరో 3 ఏళ్ల వరకు మాకు కచ్చితమైన ప్రణాళిక ఉంది. అందుకోసం వీలైనంత మేర కష్టపడతాం. ఈ క్రమంలో యువ ఆటగాళ్లు మొదట కొంచెం ఇబ్బందిపడ్డా తర్వాత సూపర్స్టార్లు అవుతారు. రజత్ కూడా అలా మెరిసిన వాడే. టీమ్ఇండియాకు ఇప్పుడున్న ఆటగాళ్లతో మూడు జట్లను ఆడించవచ్చు. ఇక ఈ మ్యాచ్లో ఓటమితో కచ్చితంగా నిరాశ చెందాం. కానీ, రాజస్థాన్ లాంటి మేటి జట్టుతో పోటీపడ్డాం. మాకన్నా ఆ జట్టే ఫైనల్లో ఉండేందుకు ఎక్కువ అర్హత కలిగిఉంది’ అని డుప్లెసిస్ పేర్కొన్నాడు.
మరోవైపు భారత్లో క్రికెట్కు విశేషమైన ఆదరణ ఉందని, తాము ఎక్కడికి వెళ్లినా అభిమానుల మద్దతు లభించిందని బెంగళూరు కెప్టెన్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే లీగ్ స్టేజ్లో ముంబయి-దిల్లీ జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్లోనూ అభిమానులు బెంగళూరు పేరు అరుస్తూ కనిపించారని చెప్పాడు. ఒక క్రికెటర్కు భారత్లో లభించే మద్దతు ఎనలేనిదని పేర్కొన్నాడు. ఇలాంటి ప్రేమాభిమానాలు చూసి ఆశ్చర్యపోతామని తెలిపాడు. వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగొస్తామని డుప్లెసిస్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.