Faisal Ali Dar:బ్రూస్లీ, జాకీ చాన్ సినిమాలు చూసి.. ప్రేరణ పొంది..
జమ్మూ కశ్మీర్లో ఇదివరకు యువత పెడుమార్గాల వైపు ఆసక్తి చూపేదనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ, కొన్నేళ్లుగా అక్కడి పరిస్థితులు మారుతున్నాయి...
(Photo: Faisal Ali Dar Twitter)
జమ్మూకశ్మీర్లో కొన్నేళ్లుగా పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు అక్కడి యువత ప్రధానంగా క్రీడలవైపు దృష్టి సారిస్తోంది. అందుకు కారణం ఫైజల్ అలీ దర్. ఒకప్పటి కిక్ బాక్సింగ్ ఛాంపియన్.. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ కోచ్గా సేవలందిస్తున్నాడు. తన పర్యవేక్షణలో పలువురు క్రీడాకారులు భవిష్యత్ తారలుగా ఎదుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మశ్రీకి ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఫైజల్ గురించి మరిన్ని విశేషాలు..
అదృష్టం కలిసిరాక..
(Photo: Faisal Ali Dar Twitter)
ఫైజల్ తొలుత కుంగ్ఫూ పోటీల్లో శిక్షణ పొందాడు. ప్రస్తుత జాతీయ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత కుల్దీప్ హందూ వద్ద జమ్మూలో తన కెరీర్ ఆరంభించాడు. అయితే, ఆ పోటీలకు కావాల్సిన క్రీడా సామగ్రి కొనుగోలు చేసేందుకు కూడా అప్పట్లో తన వద్ద రూ.4వేలు కరవయ్యాయని తాజాగా అతడు గుర్తు చేసుకున్నాడు. అలాగే 2008లో రూ.6700 ఫీజు కట్టలేక బ్లాక్ బెల్ట్ పరీక్ష కూడా కోల్పోయానని చెప్పాడు. ఈ క్రమంలోనే కుంగ్ఫూ పోటీల్లో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఒక్క పతకమూ గెలవలేక తీవ్ర నిరాశకు గురైన ఫైజల్.. తర్వాత తన కెరీర్ను మార్చుకొని కిక్ బాక్సింగ్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక్కడ 2010లో ఆసియా ఛాంపియన్షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించినా.. సరైన గుర్తింపు దక్కలేదు. దీంతో చివరికి 2013లో తన ఆటకు ముగింపు పలికాడు.
బ్రూస్లీ, జాకీచాన్ సినిమాలు అద్దెకు తెచ్చుకొని..
(Photo: Faisal Ali Dar Twitter)
ఈ మార్షల్ ఆర్ట్స్ కోచ్.. చిన్నప్పుడు తన క్రీడలో ప్రావీణ్యం పెంచుకొనేందుకు బ్రూస్లీ, జాకీచాన్ లాంటి యాక్షన్ హీరోల సినిమాలు చూసేవాడు. అది కూడా తన తండ్రిని డబ్బులు అడిగి మరీ ఆయా హీరోల సినిమా క్యాసెట్లు అద్దెకు తెచ్చుకునేవాడు. అలా ‘గేమ్ ఆఫ్ డెత్’, ‘ఎంటర్ ది డ్రాగన్’, ‘డిఫెండర్’, ‘డ్రంకెన్ మాస్టర్’ లాంటి తదితర సినిమాల నుంచి ప్రేరణపొంది.. వాటిల్లోని యాక్షన్ సన్నివేశాలను గమనించి తన స్నేహితుల ముందు ప్రదర్శించేవాడు. అప్పుడు కిక్ బాక్సింగ్లో డిఫెండింగ్ చేసేందుకు గ్లౌవ్స్ లేకపోవడంతో చెప్పులతో ప్రాక్టీస్ చేసేవాళ్లమని ఫైజల్ తన పాత రోజుల్ని గుర్తుచేసుకున్నాడు. శిక్షణ కోసం తండ్రి సంపాదన సరిపోకపోవడంతో.. ఫైజల్ వివిధ పనులు చేసేవాడు. ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్ సెంటర్ ప్రారంభించడంతో పాటు దగ్గర్లోని యాపిల్ పండ్ల రవాణాకు సంబంధించిన కూలి పనికి వెళ్లేవాడు. అలాగే డిష్ టీవీలు బిగిస్తూ వచ్చే డబ్బులతో కిక్ బాక్సింగ్ సామగ్రి కొనుగోలు చేసేవాడు.
యువత తప్పుదోవ పట్టకుండా..
(Photo: Faisal Ali Dar Twitter)
ఫైజల్ క్రీడాకారుడిగా ఉన్నప్పుడే స్వతహాగా చిన్నారులకు శిక్షణ అందించడం ప్రారంభించాడు. అక్కడి యువత తప్పుదోవ పట్టకుండా ఉండాలంటే క్రీడలే సరైన మార్గమని భావించి వారిని అటువైపు ప్రోత్సహించాడు. 2013లోనే సొంతంగా ‘అలీ స్పోర్ట్స్ అకాడమీ’ నెలకొల్పి స్థానికంగా ఉండే పార్కులు, మైదానాల్లో చిన్నారులకు వివిధ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇచ్చేవాడు. చివరికి 2018లో ఓ ప్రభుత్వ పాఠశాలలో అకాడమీని కొనసాగించేందుకు అనుమతులు ఇవ్వడంతో తన కల సాకారమైంది. అక్కడి వారికి సరైన శిక్షణ ఇస్తే అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తారనే ఆత్మవిశ్వాసంతో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే జమ్మూ కశ్మీర్లోని పలు జిల్లాల్లో శిక్షణా కేంద్రాలను ప్రారంభించి సుమారు 13 వేల మందికి శిక్షణ ఇస్తున్నాడు. అయితే, మొదట్లో ఆడపిల్లల తల్లిదండ్రుల్ని ఒప్పించడం కష్టమయ్యేదని ఫైజల్ పేర్కొన్నాడు. వారు ఎప్పుడైతే రాణించి స్వతహాగా జీవనోపాధి సంపాదించుకుంటారో అప్పుడు వారి తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.
పతకాలు సాధిస్తున్న యువతరం..
(Photo: Faisal Ali Dar Twitter)
ఫైజల్ వద్ద శిక్షణ పొందుతున్న వారిలో పలువురు ఛాంపియన్లు ఉన్నారు. వారిలో జూనియర్ ప్రపంచ కిక్ బాక్సింగ్ ఛాంపియన్గా రెండుసార్లు పేరొందిన తాజాముల్ ఇస్లామ్, 2017 మలేసియా వుషు అంతర్జాతీయ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన అబిదా అక్తర్, జూనియర్ ఆసియా కరాటే ఛాంపియన్ హషీమ్ మన్సూర్, అంతర్జాతీయ తైక్వాండో విజేత షేక్ అద్నాన్ ఉన్నారు. తన వద్ద శిక్షణ పొందే చాలా మంది క్రీడాకారులు భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధిస్తారని, దేశానికి పతకాలు సాధించి గర్వకారణంగా నిలుస్తారని ఫైజల్ దృఢ సంకల్పంతో ఉన్నారు. ఏదేమైనా జమ్మూకశ్మీర్ లాంటి ప్రాంతంలో యువతను సరైన మార్గంలో నడిపిస్తోన్న ఫైజల్కు అభినందనలు. ఆయన అనుకున్న ఫలితాలు సాధించాలని, భవిష్యత్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుందాం.
-ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు